తిరుమల చేరుతున్న భక్త జనసందోహం

బుధవారం, 31 డిశెంబరు 2014 (14:28 IST)
వైకుంఠ ఏకాదశి నాడు కలియుగ దైవం కొలువున్న వేంకటనాథుని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటే నిజంగానే వైకుంఠానికి వెళ్ళినంత పుణ్యం దక్కుతుందని హిందువులు నమ్ముతారు. ఆ నమ్మకం ఎంతో బలమైనది. రాకెట్ వేగంతో మానవుడు ముందుకు దూసుకుపోతున్నా.. ఆ రాకెట్ ను ప్రయోగాన్ని విజయవంతం చేయమని వెంకన్న స్వామిని కోరుకునేంత నమ్మకం. 
 
అందుకే పండితులు, పామరులు అనే తేడా లేకుండా వైకుంఠ ఏకాదశి నాడు తిరుమల కిటకిటలాడుతుంది. పైగా ఏడాది ఆరంభం కూడా కావడంతో జనం తిరుమల బాట పడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారులు, న్యాయమూర్తులు ఇలా ఒకరేంటి ప్రభుత్వ సారధలందరూ తిరుమలకు క్యూ కడుతున్నారు. 
 
వీరి సంగతి ఇలా ఉంటే ఇప్పటికే సామాన్య భక్తులు తిరుమల చేరుకుని క్యూ కాంపెక్సులోకి చేరేందుకు సన్నద్దమయిపోయారు. వారిని మధ్యాహ్నాం 12 గంటల నుంచి లోని అనుమతించడంతో టిబిసి ప్రాంతమంతా జనసంద్రంగా మారిపోయింది. ద్వారాల వద్ద తొపులాటలు జరుగుతున్నాయి. రోడ్లపై జనమే జనం కనిపిస్తున్నారు. వీరందరూ ఇప్పుడు క్యూలైన్లోకి అడుగిడితే వీరికి గురువారం ఉదయం 5 గంటల నుంచి దర్శన భాగ్యం లభిస్తుంది. 
 
వాస్తవానికి 1.45 గంటల నుంచే దర్శనం ఉన్నప్పటికీ ఆ సమయమంతా కైంకర్యాలకు, విఐపీలకు సరిపోతుంది. తరువాత సామాన్య భక్తులకు సాయంత్రం వరకూ దర్శన భాగ్యం కలుగుతుంది. ఏకాదశి నాడు వైకుంఠ ద్వార ప్రవేశం ఉండడంతో రోజుల తరబడి అయినా సరే క్యూలైన్లలో వేచి ఉండడానికి భక్తులు సిద్ధపడిపోయారు. 

అన్నీ చూడండి

స్వరితం 2026 శీర్షికన తమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్న ముజిగల్ మల్కాజ్‌గిరి అకాడమీ

సీఎం విజయ్ బాటలో సూర్య రాజకీయాల్లోకి వస్తే పరిస్థితి ఎలా వుంటుంది?

హైదరాబాదులో వర్షాలు.. పెరుగుతున్న అనారోగ్య సమస్యలు.. జాగ్రత్తలు

Ambani Hospital: అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్.. ఎందుకు?

రౌడీషీటర్ సాయికృష్ణ మృతి కేసు : కృష్ణలంక పీఎస్ హెడ్ కానిస్టేబుళ్ల లొంగుబాటు

అన్నీ చూడండి

30-06-2026 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

29-06-2026 సోమవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

Show comments