1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. 2 killed as heavy rain lashes West Bengal; IMD issues alert

పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు: ఇద్దరు మృతి.. ఐఎండీ ఎలెర్ట్

heavy rain
heavy rain
భారీ వర్షాల కారణంగా కోల్‌కతాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వరదల కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, హౌరా, సాల్ట్ లేక్, బరాక్‌పూర్, కోల్‌కతా పరిసర ప్రాంతాల్లో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన ప్రాంతాలు జలమయమయ్యాయి. 
 
లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం కూడా జలమయమైంది. ఎయిర్‌పోర్టు రన్‌వే, ట్యాక్సీవే దాదాపు 2 అడుగుల ఎత్తు వరకు జలమయమయ్యాయి. దీంతో ఇక్కడి నుంచి విమానాలు నడపడంలో సమస్య ఏర్పడింది.
 
దీంతో విమానాశ్రయంలో చేరిన వరద నీటిని తొలగించే పనిలో విమానాశ్రయ సిబ్బంది నిమగ్నమయ్యారు. అదేవిధంగా హౌరా, పశ్చిమ బర్ధమాన్, బిర్బమ్, తూర్పు బర్ధమాన్, హుగ్లీ, నదియా, నార్త్ 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు జిల్లాల్లో కూడా రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
About Writer
వరుణ్
తర్వాతి కథనం
డ్రమ్ముల్లో 800 కిలోలకు పైగా గంజాయి.. శంషాబాద్‌లో స్వాధీనం