దర్శకుడు కోదండరామిరెడ్డి తనయుడుగా పరిచయమైన వైభవ్ తమిళ రంగలోనే కాకుండా తెలుగులోనూ నటుడిగా నిరూపించుకుంటున్నాడు. గొడవతో తెలుగువారికి పరిచయమయి సరోజ, బిరియాని, అనామిక చిత్రాల్తో గుర్తింపు పొందాడు. తాజాగా తమిళంలో కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన కప్పల్ చిత్రంలో నటించాడు. ఆ చిత్రం తెలుగులో పాండవుల్లో ఒకడు అనే పేరుతో ఈ నెల 24న విడుదలవుతుంది. ఈ సందర్భంగా వైభవ్ చిత్రం గురించి ఇలా వెల్లడించారు. సినిమా నేపథ్యమేమిటి? ఇది...