ఫేస్‌బుక్‌తో శాంసంగ్ ఇండియా ఒప్పందం.. ఎందుకంటే?

గురువారం, 28 మే 2020 (19:50 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్‌బుక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు శాంసంగ్‌ ఇండియా ప్రకటించింది. సాధారణ రిటైల్‌ దుకాణదార్లు కూడా ఆన్‌లైన్‌కు వెళ్లేలా శిక్షణ ఇచ్చే నిమిత్తం.. ఈ డీల్ కుదుర్చుకున్నట్లు శాంసంగ్ ఇండియా తెలిపింది. ఈ భాగస్వామ్యంతో భారీ స్థాయిలో ఉన్న రిటైల్‌ భాగస్వాములు డిజిటల్‌కు వెళతారని శాంసంగ్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మొబైల్‌ బిజినెస్‌) మన్‌దీప్‌ సింగ్‌ పేర్కొన్నారు.
 
ఇప్పటికే తొలి దశ కింద 800కు పైగా ఆఫ్‌లైన్‌ రిటైలర్లకు శిక్షణ ఇవ్వగా.. రాబోయే కొద్ది వారాల్లో మరిన్ని శిక్షణ శిబిరాలు చేపట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. సాధారణ రిటైలర్లు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌ ఖాతాల ద్వారా బిజినెస్‌ పేజీలు ఏర్పాటు చేసుకోవడం, వినియోగదార్లకు స్మార్ట్‌ఫోన్ల గురించి ఎక్కువ వివరాలను అందించడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని ఫేస్‌బుక్ తెలిపింది. 
 

అన్నీ చూడండి

జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది: మెగాస్టార్ చిరంజీవి

Pawan Kalyan surgery: పవన్ కళ్యాణ్ కి మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స

అఖిల్ హిట్టు కొట్టాడు అని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది

Ramya Krishna : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లక్ష్మి ప్రణతి పాత్రలో రమ్యకృష్ణ

ఏడుగురు మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథ తో హ్యాపీ జర్నీ

తర్వాతి కథనం
Show comments