ఈ కెమేరాతో చిమ్మచీకట్లోనూ వీడియో తీయొచ్చు... వివరాలేంటి?

బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (17:08 IST)
చైనా మొబైల్ తయారీ సంస్థ షియోమీ భారత మార్కెట్‌లో వివిధ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రముఖంగా మొబైల్ రంగంలో అరంగ్రేటం చేసి అనతికాలంలోనే అగ్రగామి స్థాయికి చేరింది. మొబైళ్లు, పురుషుల షూలు, ఎయిర్ ప్యూరిఫైయర్‌లు, స్మార్ట్‌వాచీలు మొదలైన వాటిని ఇప్పటికే షియోమీ బ్రాండ్‌ తీసుకొచ్చింది. 
 
వాటితో పాటుగా ఎంఐ హోమ్ సెక్యూరిటీ కెమెరా బేసిక్ 1080పి నేడు భారత్‌లో లాంచ్ చేసింది. ఈ కెమెరా ఫుల్ హెచ్‌డీ వీడియో రికార్డింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా అందులోని ఇన్‌ఫ్రారెడ్ నైట్ విజన్ ఫీచర్‌తో 10 మీటర్ల దూరంలో చీకటిలో ఉన్న దృశ్యాలను కూడా రికార్డ్ చేస్తుంది. 
 
ఈ కెమెరా 130 డిగ్రీల కోణంలో తిరుగుతుంది. వైఫై సపోర్ట్ చేస్తుంది. ఈ కెమెరా ధరను రూ.2,699గా నిర్ణయించారు. ఈ కెమెరా రేపటి నుండి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

అన్నీ చూడండి

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments