లాక్ డౌన్ కాలంలో పెట్రోల్ మోటార్ సైకిల్‌ తయారు చేసిన బాలుడు

Written By సెల్వి
Updated: గురువారం, 3 సెప్టెంబరు 2020 (19:35 IST)
Motorcycle
కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్‌ విధించడంతో చాలామంది ఇంటి పట్టునే వుండిపోయారు. ఇంట్లో సమయాన్ని వృధా చేస్తూ.. టీవీలకు అతుక్కుపోయిన వారు చాలామందే వుండివుంటారు. కానీ ఓ బుడ్డోడు ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా.. ఓ బండి తయారు చేశాడు. ఖాళీగా ఉండే వారిలో కొందరికి చాలా మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలా పదవ తరగతి చదివే బాలుడికి కొత్త ఐడియా వచ్చింది. 
 
లాక్‌డౌన్‌లో ఖాళీ‌గా ఉండలేక ఏకంగా ఆ బాలుడు బైక్ తయారు చేసుకుని సంచలనం సృష్టించాడు. కేంద్ర పాలిత ప్రాంతమైన ఛండీగడ్‌లో పదవ తరగతి విద్యార్థి గౌరవ్ స్క్రాప్ మెటీరియల్ ఉపయోగించి.. మోటారు సైకిల్ తయారు చేశాడు.
 
ఈ సందర్భంగా అతను మీడియాతో మాట్లాడుతూ.. తాను 3 సంవత్సరాల క్రితం స్క్రాప్ మెటీరియల్ ఉపయోగించి ఎలక్ట్రిక్ బైక్ తయారు చేశానని తెలిపాడు. కానీ అది స్పీడ్‌గా వెళ్లలేకపోవడంతో.. తాను ప్రస్తుతం పెట్రోల్ మోటార్ సైకిల్‌గా దాన్ని మార్చానని వెల్లడించాడు. అది లీటరు 80 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని వివరించాడు. ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

అన్నీ చూడండి

జన నాయగన్ చిత్రం నుంచి నా సన్నివేశాన్ని తీసేసారు: గద్గద స్వరంతో నటి ఆనంది

Vijayashanti :చిన్న సినిమాల్లోనే దమ్ముంది, సబ్జెక్ట్ వుంది :విజయశాంతి

Sakshi Madolkar : శ్రీ విష్ణు సరసన హీరోయిన్ గా సాక్షి మడోల్కర్

Kalyanram: తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్నవెంకటేష్, కల్యాణ్ రామ్, అనిల్ రావిపూడి చిత్రం

Chennai Love Story review :గుండెల్ని పిండే ప్రేమకథగా కిరణ్ అబ్బవరం....చెన్నై లవ్ స్టోరీ రివ్యూ

తర్వాతి కథనం
Show comments