ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 15 జూన్ 2021 (08:51 IST)

రైలు టికెట్లపై రాయితీ పొడిగింపు

టికెట్లు బుక్‌ చేసుకొనేందుకు యూపీఐ ద్వారా పేమెంట్లు చేసే ప్రయాణికులకు భారత రైల్వే ఇప్పటికే రాయితీని కల్పిస్తోంది. తాజాగా ఈ పథకాన్ని మరో ఏడాది పాటు పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు. 

డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా 2017 డిసెంబరు నుంచి టికెట్ల బుకింగ్‌కు యూపీఐ పేమెంట్లను అందుబాటులోకి తెచ్చారు. ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకొనే వారితో పాటు రైల్వే స్టేషన్లలోని కౌంటర్లలో కూడా యూపీఐ చెల్లింపులు చేసుకొనే సౌకర్యం అందుబాటులో ఉంది.

యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ), భారత్‌ ఇంటర్‌ఫేస్‌ ఫర్‌ మనీ ( బీహెచ్‌ఐఎం) ద్వారా చెల్లింపులు చేసుకొనే అవకాశం ఉంది.

ఈ విధంగా చెల్లింపులు చేసుకున్న వారికి టికెట్‌ రుసుముపై 5 శాతం రాయితీని అందిస్తున్నారు. తాజాగా ఈ పథకాన్ని 2022 జూన్‌ వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.