శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 డిశెంబరు 2021 (09:50 IST)

తమ్ముడిని కత్తితో పొడిచి చంపిన అన్న.. ఎందుకంటే?

హర్యానాలోని ఫరీదాబాద్‌లో గొడవ కారణంగా ఒక వ్యక్తి తన తమ్ముడిని కత్తితో పొడిచి దారుణంగా చంపాడు. వివరాల్లోకి వెళితే...   మృతుడైన తమ్ముడిని విష్ణు (20)గా గుర్తించారు. అతని నిందితుడు సోదరుడు సోను నేరం చేసిన తరువాత పరారీలో ఉన్నాడు.
 
తన కుమారులు ఇద్దరూ మద్యం సేవించారని, ఏదో సమస్యపై వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని మృతుడి తల్లి తెలిపింది. తాను వాదనను ఆపడానికి ప్రయత్నించానని, అయితే సోదరులిద్దరూ ఘర్షణకు దిగారని ఆమె తెలిపింది. ఆ తర్వాత జరిగిన గందరగోళంలో నిందితుడు తన తమ్ముడిని తల్లి ముందు పొడిచి పారిపోయాడు.
 
బాద్ షా ఖాన్ సివిల్ హాస్పిటల్ నుంచి ఈ సంఘటన గురించి తనకు సమాచారం అందిందని ఏసీపీ సాత్పాల్ యాదవ్ తెలిపారు. దర్యాప్తులో, పెద్ద వాడు తన తమ్ముడిని కత్తితో పొడిచడానికి ముందు ఇద్దరు సోదరులు కత్తులతో ఒకరితో ఒకరు ఘర్షణ దిగారని వెల్లడైనట్లు తెలిపారు. 
 
ప్రస్తుతం మృతుల బంధువులు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఏసీపీ తెలిపారు. "ఫిర్యాదు అందుకున్న తర్వాతే నిందితులపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మృతుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బాద్ షా ఖాన్ సివిల్ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు' అని ఏసీపీ తెలిపారు.