1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 27 మే 2015 (10:56 IST)

రూ.300 చెల్లించండి.. సింహాన్ని వేటాడండి: 1964లో గుజరాత్‌లో..?

రూ.300 చెల్లించండి.. సింహాన్ని వేటాడండి అంటోంది గుజరాత్ సర్కార్. ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారా...? గుజరాత్ రాష్ట్రంలో రూ. 300 చెల్లించి ఓ సింహాన్ని వేటాడేందుకు ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతిని పొందవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ అనుమతులు మంజూరు చేసినట్టు గుజరాత్ మంత్రి బహదూర్ పటేల్ అసెంబ్లీకి తెలిపారు.
 
అయితే ఈ అనుమతి ఇప్పుడు కాదులెండీ, రాష్ట్రం ఏర్పడిన కొత్తల్లో జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల వివరాలకు సంబంధించిన రికార్డులు ఇటీవల వెలుగులోకి వచ్చి ఈ 'అధికారిక వేట' గురించి ప్రపంచానికి తెలిపాయి. ఆ సమావేశాల్లో గిర్ అడవుల్లో సింహాల వేట గురించి పెద్ద చర్చే జరిగింది. 1957-58లో 111 సింహాలను, 58-59లో 50 సిహాలను, 59-60లో 90 సింహాలను వేటాడేందుకు అనుమతించామని అప్పటి ఎమ్మెల్యే మాధవసింగ్ సోలంకీ అడిగిన ప్రశ్నకు పటేల్ సమాధానమిచ్చారు. 
 
1964 తరువాత సింహం మనుషులపై దాడులు చేస్తుంటే తప్ప మరే సందర్భంలోనూ వేటకు అనుమతించలేదని తెలిపారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో విషయం ఏమంటే, 1903లో భారత వైస్రాయిగా ఉన్న లార్డ్ కుర్జాన్ గిర్ అడవుల్లో వేటకు అనుమతించాలని కోరితే జునాగఢ్ నవాబు తిరస్కరించారట.