1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Modified: బుధవారం, 24 మార్చి 2021 (10:30 IST)

లక్ష మంది సైనికులు తమ ఉద్యోగాలకు స్వస్తి, ఎందుకో తెలుసా?

న్యూఢిల్లీ : పదేళ్ల కాలంలో సైనికులు ఎంత మంది తమ ఉద్యోగాలకు స్వస్థి పలికారో తెలుసా... దాదాపుగా లక్ష మంది. ఈ విషయాన్ని కేంద్రం లోక్‌సభకు తెలిపింది. కాంగ్రెస్‌ ఎంపి దీపజ్‌ బైజ్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోం శాఖ లోక్‌సభలో వివరాలు వెల్లడించింది.
 
2011 నుండి 2021 మార్చి 1 వరకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సిఆర్‌పిఎఫ్‌) నుండి 81,700 మంది, అసోం రైఫిల్‌ నుండి 15,904 మంది స్వచ్ఛంద పదవీ విరమణ లేదా రాజీనామాలు చేశారని కేంద్ర హోం శాఖ తెలిపింది.
 
రాజీనామాలు, విఆర్‌ఎస్‌ తీసుకుంటున్న విధానం ఒక్కో ఏడాది ఒక్కోలా ఉంటుందని పేర్కొంది. అయితే ఉద్యోగాలకు స్వస్థి పలికేందుకు గల కారణాలను గుర్తించేందుకు ఇప్పటి వరకు ప్రత్యేక అధ్యయనం ఏమీ చేయలేదని కేంద్రం తెలిపింది