శుక్రవారం లక్ష్మీదేవిని గులాబీ పూలతో అర్చిస్తే..?

సోమవారం, 22 డిశెంబరు 2014 (18:51 IST)
లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే అష్టైశ్వర్యాలు లభించినట్లే. సకలసంపదలను ప్రసాదించే లక్ష్మీదేవి అందరిపట్ల ఎంతో దయకలిగి ఉంటుంది. అందరినీ చల్లగా చూడటం కోసమే ఆరాటపడుతూ ఉంటుంది. కాకపోతే తాను ఉండాలనుకునే చోట ప్రశాంతత ... పవిత్రత ఉండాలని కోరుకుంటుంది. 
 
అందుకే పనికిరాని వస్తువులు ... అనవసరమైన వస్తువులు ఇంట్లో ఉంచరాదని పెద్దలు చెబుతుంటారు. అలాంటివి లేకుండా పరిశుభ్రంగా ఉండే ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పక అడుగుపెడుతుందని అంటారు. అలా వచ్చిన అమ్మవారి మనసు గెలుచుకోవాలంటే అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ తల్లిని పూజిస్తూ ఉండాలి. ముఖ్యంగా ప్రతి శుక్రవారం అమ్మవారిని 'గులాబి' పూలతో అర్చిస్తూ ఉండాలి.
 
అమ్మవారికి గులాబీలు ఎంతో ప్రీతికరమైనవి. ఈ పూలతో ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజించడం ఆ తల్లికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. సంతృప్తి చెందిన అమ్మవారు తన భక్తులను ఆనందంతో అనుగ్రహిస్తుంది. ఫలితంగా ఆదాయమార్గాలు పెరిగి ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు అంటున్నారు.

అన్నీ చూడండి

ఆంధ్ర ప్రజలకు హెచ్చరిక, ఆ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలు, జాగ్రత్త

Annamalai: బీజేపీకి బైబై చెప్పనున్న అన్నామలై

పవన్ కళ్యాణ్ జనసేన సమావేశానికి పోలీసుల అనుమతి నిరాకరణ

రాజ్యసభకు వైఎస్ షర్మిల నామినేషన్ ఖరారు

27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

అన్నీ చూడండి

02-06-2026 మంగళవారం ఫలితాలు - రుణసమస్యలు తొలగుతాయి

01-06-2026 సోమవారం ఫలితాలు - మీ కృషి నిదానంగా ఫలిస్తుంది...

01-06-2026 నుంచి 30-06-2026 వరకు మాస ఫలితాలు...

గురు చండాల యోగం, అధిగమించే మార్గాలు

31-05-2026 ఆదివారం ఫలితాలు - ఖర్చులు విపరీతం.. చేతిలో ధనం నిలవదు...

Show comments