సుబ్రహ్మణ్య షష్ఠి రోజున అరటి పండు నైవేద్యం పెడితే..?

శనివారం, 22 నవంబరు 2014 (17:02 IST)
సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ద్వారా సంతానం కలుగుతుందని విశ్వాసం. కుమార స్వామి అనుగ్రహం కారణంగా గ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు అంటున్నారు. 
 
అలాంటి సుబ్రహ్మణ్యస్వామి జన్మించిన మార్గశిర శుద్ధ షష్ఠి 'సుబ్రహ్మణ్య షష్ఠి' గా చెప్పబడుతోంది. ఈ నెల 28న వచ్చే ఆ రోజున సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వలన, ఆయన అనుగ్రహంతో పాటు పార్వతీ పరమేశ్వరుల కరుణా కటాక్షాలు లభిస్తాయని పండితులు అంటున్నారు. 
 
ఆ రోజు ఉదయాన్నే లేచి శుచిగా తలస్నానం చేసి, ఉపవాస దీక్షను చేపట్టి, నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. పూజా మందిరంలో గల సుబ్రహ్మణ్యస్వామికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. 
 
పాయసం, కందిపప్పుతో కూడిన వివిధ రకాల పదార్థాలను ఆయనకి నైవేద్యంగా సమర్పించాలి. దానిమ్మ, అరటిపండ్లను కూడా స్వామివారికి నివేదన చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు. 

అన్నీ చూడండి

పాలకొల్లు మత్య్సకారుడి వలలో రూ 2 లక్షల చేప, వీడియో

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజయ్ అసెంబ్లీ స్పీచ్.. ఆ సైగ..? (video)

సాయి కృష్ణ కేసులో పురోగతి.. కృష్ణలంక సీఐ నాగరాజు అరెస్టు.. అసలేం జరిగింది?

మాజీ మున్సిపల్ చైర్మన్ మెడలో చెప్పుల దండ వేసి కుళ్లిన కోడిగుడ్లతో కొట్టారు, ఎందుకు? వీడియో

ఏలూరు వద్ద పెద్ద పులి సంచారం.. గోదవారిలో చేపల వేట, పర్యాటక బోట్లు రద్దు (video)

అన్నీ చూడండి

23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

సత్వ గుణం అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందేమిటి?

21-06-2026 నుంచి 27-06-2026 వరకు వార ఫలితాలు - మీ మాటకు తిరుగుండదు

Show comments