ట్విట్టర్ - ఫేస్‌బుక్ ఖాతాలు తెరిచిన భారతీయ రైల్వే!

Written By PNR
Updated: మంగళవారం, 8 జులై 2014 (11:51 IST)
ప్రజలతో మరింత దగ్గరగా అనుసంధానం కావడానికి సామాజిక సమాచారం అనుసంధాన సాధనాలైన ట్విట్టర్, ఫేస్‌బుక్ ఖాతాలను భారతీయ రైల్వే ప్రారంభించింది. తమ శాఖకు చెందిన సమాచారాన్ని అత్యంత వేగంగా ప్రజలతో పంచుకునేందుకే ఈ ఖాతాలు అంటూ రైల్వే మంత్రి సదానంద గౌడ తెలిపారు.
 
కాగా, మంగళవారం లోక్‌సభలో మధ్యాహ్నం 12 గంటలకు రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆ వివరాలు కూడా ఈ సామాజిక సైట్లలో లభిస్తాయి. నెటిజన్లు facebook.com/RailMinIndia, twitter@RailMinIndia అనే పేర్లతో రైల్వే శాఖతో అనుసంధానం కావచ్చు. 
 
మరోవైపు.. ఈ రైల్వే బడ్జెట్ పై కొత్తగా ఏర్పడిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. మోడీ ప్రభుత్వం ఈ సమావేశాలలో తమ తొలి రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టనుండ౦తో సర్వత్రా దీనిపై ఆసక్తి నెలకొంది.
About Author
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

గబ్బర్ సింగ్ రమేష్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి ఆర్థికసాయం

పౌరసత్వాన్ని వదులుకుంటానంటున్న అఖిల్ అక్కినేని

కోర్కెలు తీర్చుకోవడానికి ఇండస్ట్రీకి వచ్చా : రకుల్ ప్రీత్ సింగ్

అమీర్ లోగ్ చూస్తే హైదరాబాదీల మీద గౌరవం పెరుగుతుంది : దర్శకుడు రమణా రెడ్డి

స్క్రిప్ట్ విన్నప్పుడు సందేహం ఉండేది, ఇప్పటి ఆదరణకు ఆనందగా వుంది : కిరణ్ అబ్బవరం

Show comments