ట్విట్టర్ - ఫేస్‌బుక్ ఖాతాలు తెరిచిన భారతీయ రైల్వే!

మంగళవారం, 8 జులై 2014 (11:47 IST)
ప్రజలతో మరింత దగ్గరగా అనుసంధానం కావడానికి సామాజిక సమాచారం అనుసంధాన సాధనాలైన ట్విట్టర్, ఫేస్‌బుక్ ఖాతాలను భారతీయ రైల్వే ప్రారంభించింది. తమ శాఖకు చెందిన సమాచారాన్ని అత్యంత వేగంగా ప్రజలతో పంచుకునేందుకే ఈ ఖాతాలు అంటూ రైల్వే మంత్రి సదానంద గౌడ తెలిపారు.
 
కాగా, మంగళవారం లోక్‌సభలో మధ్యాహ్నం 12 గంటలకు రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆ వివరాలు కూడా ఈ సామాజిక సైట్లలో లభిస్తాయి. నెటిజన్లు facebook.com/RailMinIndia, twitter@RailMinIndia అనే పేర్లతో రైల్వే శాఖతో అనుసంధానం కావచ్చు. 
 
మరోవైపు.. ఈ రైల్వే బడ్జెట్ పై కొత్తగా ఏర్పడిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. మోడీ ప్రభుత్వం ఈ సమావేశాలలో తమ తొలి రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టనుండ౦తో సర్వత్రా దీనిపై ఆసక్తి నెలకొంది.

అన్నీ చూడండి

'రామాయణం' చిత్రం కాదు.. భారత్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తే ప్రయాణం : రకుల్ ప్రీత్ సింగ్

అవకాశాల కోసం దిగజారను : కాజల్ అగర్వాల్

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న బ్రహ్మయుగం

New Delhi: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల ప్రకటన వెలువడింది

L.B. Sriram: ఆలస్యంగా గుర్తించినందుకు అవమానంగా ఉంది : ఎల్. బి. శ్రీరామ్

Show comments