Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీఏ రైల్వే ప్రాజెక్టులు 99.. ఒకటి పూర్తి.. అవినీతి కంపు!

Written By PNR
Updated: మంగళవారం, 8 జులై 2014 (14:56 IST)
గత యూపీఏ ప్రభుత్వం పదేళ్ళ కాలంలో మొత్తం 99 ప్రాజెక్టులను ప్రతిపాదించింది. వీటిలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును మాత్రమే పూర్తి చేయగా, మిగిలిన ప్రాజెక్టుల పరిస్థితి ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. పైపెచ్చు.. ఈ ప్రాజెక్టుల్లో భారీ స్థాయిలో అవినీతి చోటు చేసుకున్నట్టు సోమవారం లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ వెల్లడించారు. 
 
యూపీఏ ప్రవేశపెట్టిన ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ.60 వేల కోట్లని తెలిపారు. అంతేకాకుండా, గత 30 యేళ్ళలో మొత్తం 676 ప్రాజెక్టులను ప్రకటించారు. వీటి మొత్తం విలువ రూ.157883 కోట్లు. అయితే, వీటిలో 317 ప్రాజెక్టులను పూర్తి చేయగా, 359 ప్రాజెక్టులను పూర్త చేయాల్సి వుంది. ప్రతి రైల్వే బడ్జెట్‌లో కొత్త ప్రాజెక్టును ప్రవేశపెట్టడమే కానీ వాటిని పూర్తి చేసే అంశంపై ఎవరూ కూడా దృష్టిసారించలేదని విమర్శించారు. వీటిని పూర్తి చేయాలంటే వచ్చే పదేళ్ళలో 50 వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉందన్నారు. 
About Author
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

Jailer 2 Update: జైలర్ 2 ఫస్ట్ సింగిల్ తేదీని ప్రకటించిన సన్ పిక్చర్స్

అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ది రెడ్ బ్యాగ్ ఆకట్టుకుంటుంది : హరికృష్ణ సోమిశెట్టి

Mega158: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న భారీ అప్‌డేట్

NTR: ఇటు ఎన్.టి.ఆర్.కు ఫిజియో థెరపీ - అటు డ్రాగన్ డేట్ గురించి అప్ డేట్

Snadeep: తుది దశకు చేరుకున్న సిగ్మా పోస్ట్ ప్రొడక్షన్, గాంధీ జయంతికి డేట్ ఫిక్స్

Show comments