Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్రియ భోగము పట్ల మిక్కిలి ఆసక్తులై వుంటారు, అందుకే...

Written By సిహెచ్
Updated: గురువారం, 24 మార్చి 2022 (23:57 IST)
దేవాదిదేవుడైన శ్రీకృష్ణభగవానుని చేత స్వయంగా ఉపదేశించబడినట్లుగా భగవద్గీత ఉపదేశములను యధార్థముగా అనుసరించువాడు దివ్యజ్ఞానపు కృపచే సమస్త సందేహాల నుండి విముక్తుడవుతాడు.

 
సంపూర్ణ కృష్ణ చైతన్యములో తనను భగవదంశగా గుర్తించిన వ్యక్తి అదివరకే ఆత్మజ్ఞానములో స్థితుడైనట్లు అర్థము. కనుకనే నిస్సందేహముగా అతడు కర్మబంధాలకు అతీతుడవుతాడు. 

 
మానవులు ఇంద్రియభోగాల పట్ల అత్యంత ఆసక్తులై వుంటారు. దుఃఖపూరితమైన ఈ ప్రస్తుత దేహం పూర్వజన్మ కర్మఫలంగా వచ్చినదని తెలుసుకోలేరు. ఈ దేహం తాత్కాలికమైనప్పటికీ జీవులకు ఎల్లప్పుడూ అనేక రకాలైన బాధలను కలిగిస్తుంది. అందువల్లనే ఇంద్రియ భోగము కోసం తన నిజస్థితిని తెలుసుకోనంత కాలం అతడు పరాజయం చెందినట్లు విశ్వసిస్తుంటాడు.

 
అలా ఇంద్రియ భోగ భావనలో నిమగ్నుడై వుండునంత కాలం అతడికి ఒక దేహం నుంచి మరో దేహానికి పరిణామం చెందాల్సి వస్తుంది. అలా మనసు కామ్యకర్మలతో వుంటే, అజ్ఞానంతో ప్రభావితమైనప్పటికీ ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కరూ వాసుదేవుని భక్తియుక్తిసేవల పట్ల ఆసక్తి పెంపొందికోవాలి. అప్పుడే ఎవరైనను భౌతిక భవబంధముల నుంచి విముక్తి సాధించు అవకాశం పొందగలరు.

అన్నీ చూడండి

శృంగారానికి నిరాకరించిన ప్రియురాలు.. ఆవేశంతో చంపేసిన ప్రియుడు...

వేధింపులు భరించలేక మామను హత్య చేసిన కోడలు.. కేసులో సరికొత్త ట్విస్ట్

దుబాయ్‌ ఫిబ్రవరి తర్వాత అత్యధిక సందర్శకుల సంఖ్య నమోదు చేసింది; అరేబియన్ ట్రావెల్ మార్కెట్ 2026

నన్ను వదిలేయండి.. నేను లండన్‌కు వెళ్లిపోతా.. నా భర్త విచారణకు వస్తారు.. రామ నందన

బ్రిక్స్ భద్రతా వీడియోల వ్యవహారంలో ఢిల్లీ పోలీస్ సస్పెండ్

అన్నీ చూడండి

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభం

15-09-2026 రాశి ఫలితాలు, ఎవరినీ అతిగా విశ్వసించవద్దు

ఆ భయమే మనిషి మనశ్శాంతిని హరించివేస్తుంది: శ్రీ కృష్ణ పరమాత్మ

తర్వాతి కథనం
Show comments