శిరిడీ సాయి సేవలోనే తరించి 35వ యేటనే లోకయాత్ర ముగించిన భక్తురాలు...

మనమీనాడు దేశంలోని ఏ సాయి మందిరము దర్శంచినా, అక్కడ బాబా మూర్తిని భక్తులు మహరాజుగా అలంకరించి పూజించడం చూస్తాం. సాయికి నాల్గువేళలా ఆరతులు పాడడం, గురువారంనాడు వారి మూర్తిని, పాదుకలనూ రాజ లాంఛనాలతో ఊరేగించడం చూస్తాం. ఇందుకు కారణం యివన్నీ శిరిడీ సంస్థానంలో

బుధవారం, 16 నవంబరు 2016 (21:50 IST)
మనమీనాడు దేశంలోని ఏ సాయి మందిరము దర్శంచినా, అక్కడ బాబా మూర్తిని భక్తులు మహరాజుగా అలంకరించి పూజించడం చూస్తాం. సాయికి నాల్గువేళలా ఆరతులు పాడడం, గురువారంనాడు వారి మూర్తిని, పాదుకలనూ రాజ లాంఛనాలతో ఊరేగించడం చూస్తాం. ఇందుకు కారణం యివన్నీ శిరిడీ సంస్థానంలో సాయికి జరిగే సేవలే. మొదట పేదభిక్షువుగా మాత్రమే జీవించిన సాయిని ప్రత్యక్షంగా పూజించడం, వారి మశీదును రాజదర్బారులా అలంకరించడము, ఆరతులు జరిపించడము - వీటన్నింటిని మొదట ఆరంభించినది భక్తురాలు రాధాకృష్ణ ఆయీ.
 
రాధాకృష్ణ ఆయీ మొదటిసారి నానా సాహెబ్ చందోర్కర్‌తో కలసి 1905లో పండరీపురం నుండి శిరిడీ వచ్చింది. ఆమె అసలు పేరు సుందరీబాయిక్షీర సాగర్, ఆమె తాత అహ్మద్ నగర్‌లో పేరు మోసిన న్యాయవాది. చిన్న వయసులోనే ఆమె భర్త మరణించాడు. అప్పటి నుండి ఆమె తన జీవితం పరమార్థం సాధనలో గడపదలచింది. త్వరలోనే తన బంధుకోటినిస కుటుంబాన్నీ విడచి వంటరిగా భగవంతుని సేవలో జీవితం గడపసాగింది. ఎంతో నిశితమైన తత్వ జ్ఞానము, ధ్యాన పద్ధతి నేర్చంది. చివరకు ఎన్నో జన్మల పుణ్యం వలన సాయి సన్నిధి చేరింది.
 
శిరిడీ వచ్చేనాటికి ఆమె మహ సౌందర్యవతియైన యువతి. మొదటి నుండి ఆమె కృష్ణ భక్తురాలు. నిరంతరమూ ఆమె రాధాకృష్ణ అనే నామం జపిస్తుండటం వలన ఆమెకు రాధాకృష్ణ అయీ అను పేరు వచ్చింది. ఆమెకు మధురమైన కంఠముండేది, ఎన్నో భజనలు, కీర్తనలు పాడేది. ప్రధమ దర్శనంలోనే ఆమె సాయి అనబడు మానవాకృతి మాటున దాగియున్న అనంత విశ్వశక్తిని గుర్తించింది. వారినే తన సద్గురువుగా, శ్రీకృష్ణుని ప్రత్యక్ష రూపంగా భావించి యావజ్జీవతమూ సేవించింది.
 
రాధాకృష్ణ ఆయీ ఆధ్యాత్మిక సాధనలో ఎన్నో మెలకువలు తెలిసిన వివేకి. ఆమె ఇంటిని సాయిశాల అనేవారు, అంటే పాఠశాల అని అర్థం. ఉత్తమమైన సాధక జీవితం నేర్పే పాఠశాలయే ఆమె ఇల్లు. ఆమె బాబా పట్ల తీవ్రమైన శ్రద్ధ, భక్తులతో పాటు విశిష్టమైన అధికారము, ఆకర్షణా వుండేవి. ఆమె ఏదైన చెబితే, కోటీశ్వరుడైన బూటీ దగ్గర నుండి అందరు తలవంచి ఆ పని చేసేవారు. సాయి నిత్యమూ ఎండలో నడిచి లెండికి వెళ్ళేవారు. కనుక ఆ దారి పొడుగునా, రెండువైపులా ఇనుప కమ్మెలు నాటి, వాటి ప్రక్కనే లతలు మొలిపించాలని సాటి భక్తులకు ఆమె చెప్పింది. అందరూ శ్రమించి ఆ పని పూర్తిచేసారు. 
 
కొంత కాలానికి అవి బాగా పెరిగి అల్లుకొని, లెండికి వెళ్ళే మార్గమంతా ఒకే పందిరిలా అయింది. బాబా వాటి క్రిందనే నడిచి లెండికి వెళ్ళేవారు. ఆమె అనుక్షణం బాబాను సేవించి తన 35వ యేటనే ఈ లోకయాత్ర  విడిచింది.

అన్నీ చూడండి

తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రంతా కురిసిన వర్షాలు.. ప్రజలకు వేడి నుంచి ఉపశమనం

ప్రియుడు గదికి కుమార్తెను బలవంతంగా పంపిన తల్లి... ఎక్కడ?

చంద్రునిపై అన్వేషణ మిషన్లకు మద్దతుగా రోబోటిక్ ల్యాండర్లు, రోవర్లు, డ్రోన్‌లు

అక్రమ సంబంధం.. రూ.2 కోట్ల బీమా సొమ్ము కోసం భర్తను హత్య చేయించిన భార్య

ఉగాండా నుండి వచ్చిన మహిళకు ఎబోలా.. బెంగళూరులో ఐసోలేషన్

అన్నీ చూడండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

తర్వాతి కథనం
Show comments