వైకుంఠ ఏకాదశి నాడు పూజ ఎలా చేయాలి? తామరపువ్వులు, తులసీ దళాలు..?

ఆదివారం, 20 డిశెంబరు 2015 (18:48 IST)
వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠనియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించేవారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారికోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది. 
 
అందుచేత వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం ఐదు గంటలకే లేచి, శుచిగా స్నానమాచరించాలి. పూజా మందిరమును శుభ్రపరచి, గడపకు పసుపు, కుంకుమలు, తోరణాలు, ముగ్గులతో అలంకరించుకోవాలి. తలస్నానము చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజామందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు, కుంకుమ, చందనం వంటి సుగంధద్రవ్యాలతో అలంకరించుకోవాలి.
 
విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ముందు కలశమును పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రముతో కప్పి, టెంకాయ మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి. పూజకు తామరపువ్వులు, తులసి దళములు ఉపయోగించాలి.
 
ఇకపోతే... వైకుంఠ ఏకాదశి రోజున జాజిపువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లైతే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత జాజిమాలను విష్ణుమూర్తి పటానికి వేసి, పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యం సమర్పించి శ్రీహరిని స్తుతించడం శుభప్రదమని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. 

అన్నీ చూడండి

ఆరోగ్యం క్షీణిస్తున్న వాంగ్‌చుక్ నిరాహారదీక్ష

ఆస్పత్రి నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్ (ఫోటోలు)

రూ.5 లక్షలకు 111 ప్రశ్నలు విక్రయం.... : గుర్తించిన సీబీఐ

విద్యార్థుల కోసం ఉచిత కంటి పరీక్షల కార్యక్రమం ప్రారంభం

OCTOPUS: తిరుమలలో ఉగ్రవాద వ్యతిరేక మాక్ డ్రిల్‌

అన్నీ చూడండి

16-07-2026 గురువారం ఫలితాలు - పరిస్థితులు అనుకూలిస్తాయి

గర్భిణి స్త్రీ తండ్రి దేవునికి కొబ్బరికాయ కొట్టవచ్చా?

15-07-2026 బుధవారం ఫలితాలు - ఆర్థికలావాదేవీలు కొలిక్కివస్తాయి...

ఆషాఢ గుప్త నవరాత్రి ప్రారంభం.. వారాహి దేవిని పూజిస్తే...?

ఆషాఢ బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు.. జూలై 16న చారిత్రక గోల్కొండ కోటపై..?

Show comments