టీటీడీ బంపర్ ఆఫర్: క్యూ కాంప్లెక్సుల్లో ఉచిత ఫోన్ సౌకర్యం.. 2 నిమిషాల తర్వాత?

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్సుల్లో గంటల తరబడి వేచి ఉండే భక్తులు.. తమవారి యోగక్షేమాల గురించి టెన్షన్ పడుతుంటారు. వారితో మాట్లాడేందుకు వీరికి

శుక్రవారం, 2 జూన్ 2017 (10:10 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్సుల్లో గంటల తరబడి వేచి ఉండే భక్తులు.. తమవారి యోగక్షేమాల గురించి టెన్షన్ పడుతుంటారు. వారితో మాట్లాడేందుకు వీరికి ఎలాంటి అవకాశం ఉండదు. మొబైల్ ఫోన్లను బయటే మొబైల్ లాకర్స్‌లో పెట్టి దర్శనానికి వెళుతుండటమే ఇందుకు కారణం. ఈ ఇబ్బంది ఇకపై ఉండదు.  
 
ఈ ఇబ్బందిని గమనించిన టీటీడీ కొత్త ఈవో అనిల్ కుమార్ సింఘాల్ భక్తులకు ఉచిత ఫోన్ సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంలో భాగంగా  ఓ క్యూ కాంప్లెక్స్‌లో ఓ ఫోన్‌ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. తొలుత కాయిన్ బాక్స్‌లను ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ.. చివరకు ఉచితంగా సేవలను అందించాలని నిర్ణయించారు. అయితే, ఈ ఫోన్ కాల్ రెండు నిమిషాల సేపు మాత్రమే ఉంటుంది... రెండు నిమిషాల తర్వాత ఆటోమేటిక్‌గా కట్ అయిపోతుంది. 
 
ఇదిలా ఉంటే.. తిరుమల తిరుపతి దేవస్థానం నిత్య అన్నదాన ట్రస్ట్‌కు రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్‌ విద్యాసంస్థల అధినేత చొప్పా గంగిరెడ్డి మంగళవారం 10 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. మంగళవారం వేకువజామున శ్రీవారి దర్శనం చేసుకున్న గంగిరెడ్డి ఈ విరాళాన్ని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజుకు అందజేశారు. 

అన్నీ చూడండి

cockraoch janata party, నా బొద్దింక జనతా పార్టీ హ్యాక్ అయ్యింది: అభిజిత్ దిప్కే

ఆత్మహత్యకు ముందు బ్యూటీ పార్లర్‌లో త్విషా శర్మ.. ఎవరైనా ఇలా చేస్తారా?

చైనాలోని బొగ్గు గనిలో భారీ పేలుడు - 82 మంది మృతి

సూర్యాపేటలో బీఆర్ఎస్ నేత దారుణ హత్య

టీవీఎల్ అనేది కొత్త రాజకీయ పార్టీనా..? రఘురామ కృష్ణం రాజు ఏమన్నారు?

అన్నీ చూడండి

23-05-2026 శనివారం ఫలితాలు.. దంపతుల మధ్య అకారణ కలహం

Lakshmi Puja: శుక్రవారం, శుక్రపూజ.. లక్ష్మీపూజ చేస్తే?

తిరుమలలో భారీ రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటలు.. ఎండల్ని లెక్కచేయకుండా..

22-05-2026 శుక్రవారం ఫలితాలు - అనుకూలతలు అంతంత మాత్రమే

21-05-2026 గురువారం ఫలితాలు - రుణ విముక్తులవుతారు

తర్వాతి కథనం
Show comments