తిరుమల శ్రీవారికి అజ్ఞాత భక్తుడు రూ.40 కోట్ల విరాళం

తిరుమల వెంకన్నకు కానుకలు కొదవా. ఇంతింతై.. వటుండితై అన్న చందంగా స్వామివారి ఆస్తులు అలా పెరుగుతూనే ఉన్నాయి. స్వామివారికి మ్రొక్కుల రూపంలో కోట్ల రూపాయల డబ్బును భక్తులు సమర్పించుకుంటున్నారు. శ్రీవారిని కో

మంగళవారం, 16 మే 2017 (15:14 IST)
తిరుమల వెంకన్నకు కానుకలు కొదవా. ఇంతింతై.. వటుండితై అన్న చందంగా స్వామివారి ఆస్తులు అలా పెరుగుతూనే ఉన్నాయి. స్వామివారికి మ్రొక్కుల రూపంలో కోట్ల రూపాయల డబ్బును భక్తులు సమర్పించుకుంటున్నారు. శ్రీవారిని కోరికలు కోరి అది నెరవేరిన వెంటనే ఆయనకు ముడుపులు సమర్పిస్తున్నారు. 
 
అలా ఒకటి కాదు రెండు కాదు కోట్ల రూపాయలు సమర్పిస్తున్నారు భక్తులు. స్వామివారిపై భారం వేసిన తర్వాత ఆయన అన్నీ చూసుకుంటారు కాబట్టి ఆయనకు వాటా ఇస్తుంటారు భక్తులు. ఇది మామూలుగా అందరూ చెప్పుకునేదే. అయితే శ్రీనివాసుడు మాత్రం మంచి పనులకు ఎప్పుడూ తోడుగా ఉంటారని పెద్దలు చెబుతుంటారు.
 
తిరుమల శ్రీవారికి ఒక అజ్ఞాత భక్తుడు 40 కోట్ల రూపాయల విరాళాన్ని ఇచ్చాడు. అది కూడా ఎవరికి చెప్పవద్దని అతి రహస్యంగా డబ్బుల రూపంలో తితిదే ఉన్నతాధికారులకు సమర్పించారట. తెలిసి ఇచ్చిన కూడా డబ్బుకు ఎలాంటి పన్ను ఉండదు. కానీ ఎందుకో భయపడిన భక్తుడు మొత్తం డబ్బును తితిదే ఈఓకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ డబ్బును భక్తులకు ఉపయోగపడేలా చూడాలని అజ్ఞాత భక్తుడు తితిదేని కోరాడట. మరి ఈ మొత్తాన్ని దేనికి ఉపయోగించాలన్న ఆలోచనలో తితిదే ఉంది. 

అన్నీ చూడండి

తెలిసినవారితో తెలుగు అమ్మాయిలు జాగ్రత్త, 80 శాతం లైంగిక దాడులకు వీళ్లే కారకులు, రిపోర్ట్

Rahul Gandhi: జంతర్ మంతర్ వద్ద రాహుల్ గాంధీ.. ఎత్తుకెళ్లిన పోలీసులు

బ్రిటన్‌లో తొలి ఏఐ మంత్రిగా భారతీయుడు

Mysuru: భార్య, ఇద్దరు కుమార్తెల గొంతు నులిమి చంపేసిన భర్త

దారుణం, రెండ్రోజుల వయసున్న ఆడ శిశువును సంచీలో పెట్టి రోడ్డుపక్కన వదిలేసారు

అన్నీ చూడండి

విద్యా ప్రతిభకు, జ్ఞాపక శక్తికి హయగ్రీవుని మంత్రం

21-07-2026 మంగళవారం ఫలితాలు- తప్పుచేశామన్న భావం రానీయకండి

బోనాల ఉత్సవాల కోసం గోల్కొండ కోటకు పోటెత్తిన భక్తులు

20-07-2026 సోమవారం ఫలితాలు - వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు...

19-07-2026 ఆదివారం ఫలితాలు - వస్తులాభం.. వస్త్రప్రాప్తి ఉన్నాయి....

తర్వాతి కథనం
Show comments