తిరుమల భక్తుల రద్దీ రద్దీ... కంపార్ట్‌మెంట్లన్నీ ఫుల్

శనివారం, 21 మే 2016 (12:38 IST)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. భక్తులతో తిరుమల గిరులు మొత్తం కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా భక్తులే..భక్తులు. దర్శన కంపార్టుమెంట్ల నుంచి గదులు, తలనీలాలు ఇచ్చే ప్రతి ప్రాంతంలోనే భక్తులు కనిపిస్తున్నారు. శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. సర్వదర్శనం కోసం ఉదయం 5 గంటల నుంచి అన్ని కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 
 
కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయి క్యూలైన్లు బయటకు వచ్చేశాయి. కాలినడక భక్తులు 8 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారికి 5 గంటల్లో దర్శనం కల్పిస్తామని తితిదే చెబుతోంది. అయితే సర్వదర్శనం కంపార్టుమెంట్లలోని భక్తులకు 12 గంటల్లోగా దర్శనం కల్పిస్తామని తితిదే చెబుతోంది. అయితే అంతకుమించి సమయం పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 
 
భక్తులు గదులు దొరక్క రోడ్లపైనే సేదతీరుతున్నారు. సీఆర్‌ ఓ కార్యాలయం, ఎంబిసి-34, పద్మావతి విచారణ కార్యాలయాన్నింటిను గదుల కోసం భక్తులు పడిగాపులు కాస్తున్నారు. శనివారం శ్రీవారిని 75,148 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 2 కోట్ల 14 లక్షల రూపాయలు లభించింది.

అన్నీ చూడండి

టెక్కీ రాధా గాయత్రి మృతి కేసు : విచారణకు సహకరించాలని చెప్పా : శ్రీచరణ్ తండ్రి

హృద్రోగంతో చనిపోతే నీవు అనాథవు అవుతావు.. భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న వృద్ధ భర్త

జూలై నెలలో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు

వాష్ రూమ్‌లో ప్రసవించి వెంటిలేటర్ రంధ్రం నుంచి నవజాత శిశువును విసిరేసిన యువతి

బికారి అయిన వ్యక్తి మోజులో పడి కోటీశ్వరుడైన కాబోయే భర్తను హత్య చేసిన యువతి

అన్నీ చూడండి

24-06-2016 బుధవారం ఫలితాలు - తాకట్టు విడిపించుకుంటారు

Nirjala Ekadashi 2026: నిర్జల ఏకాదశి నాడు ఏం చేయాలి..?

23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

తర్వాతి కథనం
Show comments