ధర్మప్రచారానికి వారధిగా శుభప్రదం బోధకులు నిలవాలి : తితిదే ఈఓ సాంబశివరావు

శనివారం, 7 మే 2016 (16:51 IST)
సనాతన ధర్మప్రచారానికి వారధులుగా శుభప్రదం బోధకులు నిలవాలని తితిదే ఈఓ సాంబశివరావు పిలుపునిచ్చారు. తిరుపతిలోని శ్వేత భవనంలో శనివారం శుభప్రదం బోధకులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ శుభప్రదంలో శిక్షణ పొందిన బోధకులు తమ జిల్లాలోని శుభప్రదంలో పాల్గొనే ఇతర అధ్యాపకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. బోధకులు పాఠ్యాంశాలను సరళమైన పద్ధతిలో బోధించి ఎక్కువమంది విద్యార్థులు స్ఫూర్తి పొంది, మార్గదర్శకంగా నిలిచేలా తీర్చిదిద్దాలని సూచించారు.
 
అధ్యాపకులు, పాఠ్యాంశాలు సరళమైన పద్ధతులతో బోధించాలని అందుకు అనుగుణంగా పాఠ్యాంశాల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. శుభప్రదంలోని బోధన అంశాలను శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ద్వారా ప్రసారం చేయడం ద్వారా లక్షలాది మంది ప్రజలు తెలుసుకుంటారని ఈఓ తెలిపారు. శుభప్రదం కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని మొత్తం 60 కేంద్రాల్లో 23 వేల మంది 8,9,10 తరగతుల విద్యార్థినీ, విద్యార్థులు మే 22 నుంచి 29వ తేదీ వరకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు.

అన్నీ చూడండి

ఢిల్లీ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ దారుణ హత్య.. కారణం ఎవరంటే?

జూన్ 12 నుంచి కాదు.. జూన్ 15 నుంచి స్కూల్స్ పునః ప్రారంభం

కోలివింగ్ ప్రియుడి వేధింపులు తాళలేక ఐదవ అంతస్థు నుంచి దూకేసింది..

Elon Musk: భారత సంతానోత్పత్తి రేటు పడిపోయింది.. స్పేస్ఎక్స్ సీఈఓ మస్క్

వాట్సాప్ నుంచి ట్రిపుల్ తలాక్ ఇచ్చిన కువైట్ భర్త.. పోలీసులకు భార్య ఫిర్యాదు

అన్నీ చూడండి

08-06-2026 సోమవారం ఫలితాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం...

07-06-22 ఆదివారం ఫలితాలు - సంకల్ప బలంతోనే కార్యం సిద్ధిస్తుంది

07-06-2026 నుంచి 13-06-2026 వరకు ఫలితాలు - అన్ని విధాలా యోగదాయకమే

06-06-2026 శనివారం ఫలితాలు - సర్వత్రా మీదే పైచేయి

శ్రీవారి ఆలయంలో పోటెత్తిన భక్తులు.. రికార్డు స్థాయిలో లడ్డూల విక్రయం, హుండీ ఆదాయం

తర్వాతి కథనం
Show comments