Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి దర్శనానికి మార్గదర్శకాలు సిద్ధం చేసిన తితిదే - తొలి 3 రోజులు వారికే..

Written By ఠాగూర్
Updated: గురువారం, 14 మే 2020 (16:03 IST)
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు. ఫలితంగా గత 50 రోజులకు పైగా తిరుమల కొండపైకి భక్తులు ఒక్కరంటే ఒక్కరు కూడా వెళ్లలేదు. కేవలం తిరుమల గిరిపై నివాసిస్తున్న ఉద్యోగులు, తితిదే సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 17వ తేదీన లాక్డౌన్ ఎత్తివేసిన పక్షంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులను అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలను కూడా సిద్ధం చేసింది. 
 
వీటిలోభాగంగా, తొలి మూడు రోజుల పాటు కేవలం తితిదే సిబ్బందికి మాత్రమే దర్శనం కల్పిస్తారు. ఆ తర్వాత తిరుపతి, తిరుమల ప్రజలకు 15 రోజుల పాటు దర్శనం అందుబాటులోకి తెస్తారు. అదీకూడా ప్రయోగాత్మకంగా ఈ దర్శనం కల్పించనున్నారు.
 
అంతేకాకుండా, రోజుకు కేవలం 14 గంటల పాటు కేవలం 500 మందికి మాత్రమే దర్శనం కల్పిస్తారు. ఆ లెక్కన వారానికి 7 వేలు మంది మాత్రమే శ్రీవారిని దర్శనం చేసుకునే వెసులుబాటు లభించనుంది. ఇతర భక్తుల కోసం దర్శన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో తితిదే విక్రయించనుంది. 

అన్నీ చూడండి

September 01, 2026: మంగళవారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

అయ్యొయ్యో... అన్యాయంగా చంపేసాడు, వీడియో

నెల్లూరులో రౌడీ షీటర్‌ను రాళ్లతోనే కొట్టి చంపేశారు.. తల్లిని చంపాడు.. చివరికి..?

ఉజ్జయిని శ్మశానం కాలుతున్న శవం నుంచి మాంసం తింటున్న లేడీ అఘోరీ

121 స్పా, మసాజ్ సెంటర్లపై ఏకకాలంలో దాడి.. వైజాగ్‌లో వ్యభిచార ముఠా అరెస్ట్

అన్నీ చూడండి

01-09-2026 మంగళవారం రాశి ఫలితాలు... ఇతరుల మాటలను నమ్మి తొందరపడి..?

01-09-2026 నుంచి 30-09-2026 వరకు సెప్టెంబర్ మాస ఫలితాలు

కోడమూరు శ్రీ వేంకటేశ్వర స్వామికి తేళ్లను సమర్పిస్తున్న భక్తులు.. అలా చేస్తే?

బెజవాడ కనకదుర్గమ్మకు 119.5 గ్రాముల బంగారు జడ.. 15 రోజుల్లో వజ్ర కిరీటం..

31-08-2026 సోమవారం ఫలితాలు - బెట్టింగులు, జూదాల జోలికిపోవద్దు...

తర్వాతి కథనం
Show comments