Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి వారు తిరుమలకు రావొద్దు : తితిదే

Written By వరుణ్
Updated: ఆదివారం, 9 ఏప్రియల్ 2023 (16:17 IST)
వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునే నిమిత్తం కొండపైకి భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల సెలవు కావడంతో వీటిని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా అనేక మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఏడుకొండలపైకి వచ్చారు. దీంతో తిరుమల కొండలు భక్తులతో నండిపోయాయి. ప్రస్తుతం తిరుమల శ్రీవారి దర్శనానికి కనీసం 30 గంటల సమయం పడుతుంది. 
 
శుక్రవారం నుంచి మొదలైన రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రద్దీ ఆదివారం మరింతగా పెరిగింది. దీంతో తితిదే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సర్వదర్శన టోకెన్లు లేనిభక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌-లోనే కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లలో నిండిపోయాయి. వీరు స్వామి వారిని దర్శించుకునేందుకు 30 గంటలకుపైగా సమయం పడుతుంది. 
 
తిరుమల కొండపై రద్దీ పెరగడంతో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఎస్ఎస్‌డీ, దివ్యదర్శనం టోకెన్లు ఉన్నవారు మాత్రమే కొండపైకి రావాలని విజ్ఞప్తి చేసింది. టోకెన్లు లేనివారు కొండపైకి వచ్చి ఇబ్బంది పడొద్దని వారు కోరారు. కాగా, స్వామివారిని శుక్రవారం 71 వేల 782 మంది దర్శనం చేసుకోగా, హిండీ కానుక ద్వారా శ్రీవారికి రూ.3.20 కోట్ల ఆదాయం వచ్చింది. 

అన్నీ చూడండి

సుప్రీం కోర్టు ఆదేశాన్నే ధిక్కరిస్తారా? బొద్దింక జనతా పార్టీ మైండ్ సెట్ పైన నెటిజన్లు ఫైర్

ఏపీలో స్కైరూట్ ఏరోస్పేస్‌కు 300 ఎకరాల భూమి కేటాయింపు.. నారా లోకేష్ హర్షం

లోకేష్ సార్.. మిమ్మల్ని కలవాలనుంది.. చిన్నారులకు ఓకే చెప్పిన మంత్రి (video)

పెళ్లి కాలేదన్న ఆవేదన.. మహారాష్ట్రలో ఏకంగా 29మంది యువకుల ఆత్మహత్య

టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్‌కు అంతర్జాతీయ అరెస్ట్ వాంటెడ్ నోటీసు

అన్నీ చూడండి

తిరుమల తరహాలో శబరిమలలోనూ నెయ్యి కుంభకోణం.. ఎలా జరిగిందంటే?

TTD: శ్రీవారి సేవ వాలంటీర్ల కోసం సిబిల్ స్కోర్ తరహా రేటింగ్.. ఈవో

29-07-2026 బుధవారం ఫలితాలు : మీ కృషిలో లోపం లేకుండా చూసుకోండి

తిరుమల జపాలి వద్ద తెల్లగా వస్తున్న నీరు.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ (video)

Guru purnima 2026: గురు పౌర్ణమి రోజున ఐదు యోగాలు.. ఈ రాశులకు అదృష్టం..

తర్వాతి కథనం
Show comments