శ్రావణమాసం.. లక్ష్మీదేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేకంగా ఆరాధించే మాసం. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఆరాధించే పర్వదినమే శ్రీవరలక్ష్మీ వ్రతం. అలాంటి పవిత్రదినం నేటి శుక్రవారం. ఈ పర్వదినం సందర్భంగా బెజవాడలోని కనకదుర్గమాత ఆలయం భక్తులతో కిక్కిరిసి పోయింది.