నేడు ఒంటిమిట్ట రామయ్య కల్యాణోత్సవం.. హాజరుకానున్న గవర్నర్ - సీఎం

బుధవారం, 20 ఏప్రియల్ 2016 (09:04 IST)
కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామ ఆలయంలో కళ్యాణోత్సవం బుధవారం జరుగనుంది. రాత్రి 8-10 గంటల మధ్య కల్యాణం నిర్వహించడానికి వేదికను సుందరంగా ముస్తాబు చేశారు. ఈ కళ్యాణోత్సవాన్ని భక్తులు తిలకించేందుకు వీలుగా దాదాపు 70 ఎకరాల సువిశాల ప్రాంగణంలో చలువ పందిళ్లు, కార్పెట్‌లు సిద్ధం చేశారు. అలాగే, భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 
 
భక్తులకు ఆహారం, మజ్జిగ, మంచి నీరు అందించేందుకు 40 కౌంటర్లు ఏర్పాటు చేశారు. కల్యాణోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నారు. దీంతో 2 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, టీటీడీ ఓఎస్డీ డాలర్ శేషాద్రి ఆలయంలో పూజా విధానాలను పరిశీలించారు. స్వామివారి కల్యాణం నిర్వహించే విధానం, ఏర్పాట్ల గురించి అర్చకులతో చర్చించారు.  

అన్నీ చూడండి

కాలి నడకన తిరుమలకు 116 యేళ్ల వృద్ధురాలు.. 6న వీఐపీ బ్రేక్ దర్శనం

సెల్‌‍ఫోన్ వెలుతురో ఆర్టీసీ బస్సుడ్రైవింగ్... గాల్లో ప్రయాణికుల భద్రత

నా కొడుకును కిడ్నాప్ చేసి.. నాపై అత్యాచారం చేశాడు.. షౌకత్ మొల్లాపై మహిళ ఫిర్యాదు

ముంబై నగరానికి రెడ్ అలర్ట్ జారీ- ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

ఖమేనీ అంత్యక్రియల్లో ప్రజల కన్నీళ్లు నకిలీ అయి వుండొచ్చు.. ట్రంప్

అన్నీ చూడండి

05-07-2026 ఆదివారం ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మవద్దు

05-07-2026 నుంచి 11-07-2026 వరకు ఫలితాలు - కొత్త సమస్య తలెత్తే ఆస్కారం..?

04-07-2026 శనివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

రికార్డు స్థాయిలో అమ్ముడుబోయిన శ్రీవారి లడ్డూ ప్రసాదం

03-07-2026 శుక్రవారం ఫలితాలు - మనోభీష్టం సిద్ధిస్తుంది

Show comments