కరోనావైరస్ భయం, ఇంట్లోనే ఈ లడ్డూలు చేసిపెట్టండి

Written By సిహెచ్
Updated: శనివారం, 12 సెప్టెంబరు 2020 (21:29 IST)
ఇప్పుడు కరోనావైరస్ నేపధ్యంలో స్వీట్ షాపుల్లో ఏవైనా కొనాలంటే భయం పట్టుకుంటోంది. ఇంకోవైపు పిల్లలు చిరుతిళ్ల కోసం గోల చేస్తుంటారు. పిల్లలకి హాయిగా ఇంట్లోనే రవ్వలడ్డులు చేసిపెడితే చక్కగా తినేస్తారు. వాటిని ఎలా చేయాలో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు :
బొంబాయి రవ్వ- రెండు కప్పులు
తురిమిన పచ్చికొబ్బరి- రెండు కప్పులు
పంచదార- ఒకటిన్నర కప్పు
నెయ్యి- అర కప్పు
జీడిపప్పు- రెండు టీస్పూన్‌లు
కిస్ మిస్- రెండు టీస్పూన్‌లు
యాలకుల పొడి- పావు టీస్పూన్
 
తయారీ విధానం :
మొదట దళసరి మూకుడులో కొంచెం నెయ్యి వేసి రవ్వను దోరగా వేయించుకోవాలి. దీంట్లో కొబ్బరి తురుము, పంచదార వేసి నీరు కొద్దిగా పోసి కలియ బెట్టాలి. పంచదార కరిగి గట్టిపడుతున్నప్పుడు యాలకుల పొడి చల్లి దించుకోవాలి.
 
ఈ మిశ్రమంలో నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్ వేసి ఆరిపోక ముందే గుండ్రంగా లడ్డూలు చుట్టుకోవాలి. లడ్డూలుగా చేసేటప్పుడు ఆరిపోయినట్లనిపిస్తే, కొంచెం పాలు చల్లుకుంటూ ఉండలు చుట్టుకుంటే బాగా వస్తాయి.

అన్నీ చూడండి

ఘర్షణల కంటే చర్చలే సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తాయి : కమల్ హాసన్

జోగి రమేశ్ కుటుంబీకులు అలాంటివారా... ఇంటి బాగోతాన్ని బయటపెట్టిన పెద్ద కోడలు!

పని చేయని లిఫ్టు.. మేనేజర్‌ను హేళన చేస్తూ చెంప పగులగొట్టిన కరుణానిధి మనవరాలు (Video)

తిరుమల క్షేత్రంపై శబ్దం చేస్తే కేసు... అపరాధం

లైంగిక నేర బాధితురాలి గోప్యతను కాపాడేందుకు హైకోర్టు న్యాయవాది పోరాటం

అన్నీ చూడండి

కోర్కెలు తీర్చుకోవడానికి ఇండస్ట్రీకి వచ్చా : రకుల్ ప్రీత్ సింగ్

అమీర్ లోగ్ చూస్తే హైదరాబాదీల మీద గౌరవం పెరుగుతుంది : దర్శకుడు రమణా రెడ్డి

స్క్రిప్ట్ విన్నప్పుడు సందేహం ఉండేది, ఇప్పటి ఆదరణకు ఆనందగా వుంది : కిరణ్ అబ్బవరం

Jai Krishna: కొన్ని చోట్ల అలా అనిపించొచ్చు, వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలి ఉంది : జై కృష్ణ ఘట్టమనేని

Rohit Nara : వినికిడి లోపం గల సౌండ్ ఇంజినీర్ గా రోహిత్ నారా టైటిల్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments