Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమ్రపాలికి మరో కీలక బాధ్యతలు.. హెచ్‌జీసీఎల్ బాధ్యతలు...

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 4 ఫిబ్రవరి 2024 (10:54 IST)
ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి మరో కీలక పోస్టు వరించింది. ఇప్పటికే ఆమె హెచ్ఎండీఏ ఐటీ, ఎస్టేట్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ఇపుడు కొత్తగా మరో కీలక బాధ్యతలను మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు అప్పగించింది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టరుగా, ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్ అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, మెట్రో పాలిటన్ కమిషనర్ డాక్టర్ ఎం దాన కిశోర్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. 
 
ప్రస్తుతం హెచ్ఎండీఏ అదనపు కమిషనరుగా అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న దాన కిశోర్ ఈ నెల ఆరో తేదీన  హెచ్ఎండీఏపై పూర్తి స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. శనివారం హెచ్ఎండీఏ కార్యాలయానికి వచ్చిన ఆయన అక్కడ క్షణం తీరిక లేకుండా గడిపారు. వివిధ ప్రాజెక్టులు, అత్యవసరంగా పరిష్కరించాల్సిన దరఖాస్తులను ఆయన అధికారులతో కలిసి సమీక్షించారు. ఆ తర్వాత హెచ్‌జీసీఎల్ ఎండీగా ఆమ్రపాలిని నియమిస్తూ ఆదేశాలు జారీచేశారు. 

అన్నీ చూడండి

రెండో వారంలోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రవితేజ 'ఇరుముడి'

'టాక్సిక్' సాహసోపేతమైన ప్రయోగం : రిషబ్ శెట్టి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సెన్సేషనల్ రన్..150 కోట్లు దాటిన గ్రాస్

మమితా బైజు మలయాళ చిత్రం ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ తెలుగులో రాబోతోంది

కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ముగ్గురు కోతులు టైటిల్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments