శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 ఫిబ్రవరి 2025 (16:14 IST)

Microsoft Campus : గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌‌ను రేవంత్ రెడ్డి (video)

Revanth Reddy
Revanth Reddy
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మైక్రోసాఫ్ట్- హైదరాబాద్ నగరానికి మధ్య ఉన్న దీర్ఘకాల సంబంధాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. 
 
భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)దేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విద్యారంగంలో AI-ఆధారిత ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ రంగంలో తన ప్రయత్నాలలో భాగంగా మైక్రోసాఫ్ట్ 500 పాఠశాలల్లో AI ఆధారిత అభ్యాసాన్ని సమగ్రపరుస్తోందని పేర్కొన్నారు. 
 
తెలంగాణలో మైక్రోసాఫ్ట్ విస్తరణ రాష్ట్ర యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని ముఖ్యమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, హైదరాబాద్‌లో AI కేంద్రాన్ని స్థాపించడానికి తెలంగాణ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో ఒప్పందంపై సంతకం చేసింది.