కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

ఠాగూర్
ఆదివారం, 23 మార్చి 2025 (13:31 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కూషాయిగూడ పారిశ్రామికవాడలో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. చెత్త కుప్పలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృత్యువాతపడ్డాడు. చెత్త ఎత్తుతుండగా ఈ పేలుడు సంభవించింది. రోడ్డు పక్కనే చోటుచేసుకున్న ఈ ఘటనతో పాదాచారులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
 
స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో పేలుడుకు కారణం రసాయన పదార్థాలని గుర్తించారు. 
 
అయితే, ఈ కెమికల్స్ అక్కడకు ఎలా వచ్చాయి. ఎవరు వేశారన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, ఘటనా స్థలానికి సమీపంలోని ఓ సీసీటీవీ కెమెరాలో ఈ పేలుడుకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


 

అన్నీ చూడండి

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments