తెలంగాణాలో మంగళవారం వెల్లడికానున్న టెన్త్ ఫలితాలు!!

వరుణ్
సోమవారం, 29 ఏప్రియల్ 2024 (13:18 IST)
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నాయి. ఆ దిశగా ఆ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలు ఆన్‌లైన్‌లో విడుదల చేసేలా ఏర్పాట్లుచేశారు. పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం కూడా అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. అయితే, ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈ ఫలితాలను మంత్రి విడుదల చేయడం లేదు 
 
ఇకపోతే, మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెల్సిందే. సుమారుగా 5.08 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 2,50,433 మంది బాలికలు, 2,57,952 మంది బాలురు ఉన్నారు. ఏప్రిల్ 13వ తేదీ నుంచి జవాబు పత్రాల మూల్యాంకన చేపట్టగా, ఈ ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాటు చేసింది. ఈ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ https://results.bsetelangana.org లో చెక్ చేసుకోవచ్చు. 

అన్నీ చూడండి

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

VN Aditya: వినోదభరితంగా మన డాక్టర్ బాబే సినిమా: వీఎన్ ఆదిత్య

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

తర్వాతి కథనం
Show comments