Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజామాబాద్ జిల్లాలో వాహనం ఢీకొని చిరుతపులి మృతి

Written By సెల్వి
Updated: శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (08:13 IST)
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుతపులి మృతి చెందింది. చాంద్రాయణపల్లి సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టింది. చిరుత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. కేసు నమోదు చేసి చిరుతను ఢీకొన్న వాహనాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని అటవీశాఖ అధికారులు తెలిపారు.
 
అతివేగం జంతువులను పొట్టనబెట్టుకుంటుంది. చాంద్రాయణపల్లి సమీపంలో చిరుతపులిని చంపేశారు.. అని తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మోహన్ పర్గేయన్ ట్వీట్ చేశారు. నిజామాబాద్‌తో పాటు పక్కనే ఉన్న కామారెడ్డి జిల్లాలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
 
ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అడవుల గుండా వెళ్లే హైవేలపై వాహనాల వేగాన్ని నియంత్రించాలని జంతు సంరక్షణ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. జంతువుల కోసం అడవుల్లో అండర్‌పాస్‌లు, వంతెనలు నిర్మించాలని సూచించారు.

అన్నీ చూడండి

హైదరాబాద్‌ను ఉర్రూతలూగించనున్న రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

Rahul Sipligunj Case: రాహుల్ సిప్లగింజ్ కేసు.. ఒకవేళ ఆమె రాకపోతే...?

దేవ కట్టా సమర్పణలో రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ చిత్రం జో జో’

నేను రెడీ నుంచి హవీష్, కావ్య థాపర్ పై మస్తుగుందిరా యవ్వారం సాంగ్

అమీర్ లోగ్ చాలా రియలిస్టిక్‌గా, రా గా అనిపిస్తోంది : సాయి మార్తాండ్

తర్వాతి కథనం
Show comments