బావిలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృత్యువాత

గురువారం, 29 జులై 2021 (14:50 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బావి నలుగురు వ్యక్తులను మింగేసింది. జిల్లాలోని నముల్కనూరు శివారులో ఓ కారు అదుపు తప్పి వ్యాసాయ బావిలోకి దూసుకెళ్ళింది. కారు పూర్తిగా ఆ వ్యవసాయ బావిలోకి మునిగిపోయింది. 
 
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కారుని బావి నుంచి వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కారులో ఉన్న వ్యక్తులు నలుగురు మృత్యువాతపడ్డారు.
 
దీంతో వారిని వెలికి తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ దారుణ ప్రమాదం కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వెళ్తుండగా చినముల్కనూరు శివారులో చోటుచేసుకుంది. కారులో ఉన్నవారి వివరాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

అన్నీ చూడండి

అద్భుత డ్యాన్స్ టాలెంట్‌తో అదరగొట్టిన బాలయ్య చిన్న కుమార్తె (వీడియో)

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

తర్వాతి కథనం
Show comments