Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు

Written By ఠాగూర్
Updated: బుధవారం, 8 జూన్ 2022 (18:18 IST)
వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, ఫైర్‌బ్రాండ్ రాజా సింగ్‌పై ఆ రాష్ట్ర పోలీసులు కేసునమోదు చేశారు. ఇటీవల తెలంగాణాలో జరిగిన పార్టీ బహిరంగ సభలో ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
అదీకూడా రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ దర్గా సూఫీ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీపై రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలపై హైదరాబాద్ కంచన్ బాగ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
రాజాసింగ్ ఓ వీడియోలో సూఫీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ సూఫీ ప్రతినిధి బృందం పోలీసులకు ఓ ఫిర్యాదు చేసింది. దీంతో ఘోషామహల్ అసెంబ్లీ స్థానం ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్‌పై ఐపీసీ సెక్షన్ 295ఏ కింద కేసు నమోదు చేశారు. 

అన్నీ చూడండి

యశ్ 'టాక్సిక్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి - మల్లారెడ్డి వర్శిటీపై కేసు

దుష్ప్రచారం చేస్తే రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తా : గోవిందా హెచ్చరికలు

బాలీవుడ్ హీరోహీరోయిన్ల మధ్య వయసు అంతరం : మనీషా కోయిరాలా

మూడోసారి గర్భమా? అది ప్రెగ్నెన్సీ కాదు.. పిజ్జా తినడం వల్లే...

ఇకపై కేవలం బ్లాక్‌బస్టర్ చిత్రాలే తీస్తా : నిర్మాత బండ్ల గణేశ్

తర్వాతి కథనం
Show comments