నేడు నల్గొండ జిల్లా పర్యటనకు సీఎం కేసీఆర్

గురువారం, 28 ఏప్రియల్ 2022 (09:50 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గురువారం నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ వెళుతున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నరసింహులు (75) అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే.
 
గుురువారం ఎమ్మెల్యే చిరుమర్తి కుటుంబ సభ్యులు సంతాప సభ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చుతారు. ఇందుకోసం సీఎం కేసీఆర్ ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో నార్కేట్‌పల్లికి చేరుకుంటారు. సీఎం కేసీఆర్‌ వెంట మంత్రి జగదీశ్‌ రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర టీఆర్‌ఎస్‌ నేతలు హాజరవుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

అన్నీ చూడండి

Trisha: అభిమానులు గోల చేసాక విజయ్‌కు విషెస్ చెప్పిన త్రిష

Ramcharan and modi: న్యూఢిల్లీలో రిపబ్లిక్ సమ్మిట్‌లో మోదీతో రామ్ చరణ్, అనిల్ కపూర్

Manchu Lakshmi: క్రియేటర్స్ కు ఇన్ఫ్లుయెన్సర్స్ కు మధ్య తేడా ఉంది :మంచు లక్ష్మి

సినిమా అనేది చౌకైన వినోద సాధనం, పాప్‌కార్న్, స్నాక్స్ ధరలు తగ్గితే? చెర్రీ

సెన్సార్ తో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, రోజు రోజుకూ కలెక్లన్లు పెరుగుతున్నాయి : దీవాన నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments