Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెలాఖరు వరకు అన్ని పరీక్షలు వాయిదా వేసిన యూనివర్శిటీ

Written By ఠాగూర్
Updated: సోమవారం, 17 జనవరి 2022 (11:56 IST)
ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనేకాకుండా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. విద్యా సంస్థలు కూడా మూసివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు అన్ని రకాల పరీక్షలను వాయిదావేస్తున్నట్టు హైదరాబాద్‌లోని బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 
 
తెలుగు రాష్ట్రాల పరిధిలో ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించనున్న అన్ని పరీక్షలను వాయిదా వేసినట్టు పేర్కొంది. ఈ పరీక్షలను తదుపరి నిర్వహించేందుకు వీలుగా కొత్త షెడ్యూల్‌ను రిలీజ్ చేస్తామని వర్శిటీ అధికారులు వెల్లడించారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలు విద్యార్థులకు సంక్రాంతి సెలవులను ఈ నెల 30వ తేదీ వరకు పొడగిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. 
 
దీంతో మంగళవారం నుంచి జరగాల్సిన పరీక్షలను కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయం వాయిదావేసింది. అయితే, ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తామని ఉస్మానియా యూనివర్శిటీ ఓ ప్రకటనలో తెలిపింది. 

అన్నీ చూడండి

2027 మార్చి నాటికి వెయ్యికి పైగా ఒరిజినల్ మైక్రో డ్రామాలు, మీ ఫోనుల్లోనే ఇక స్టోరీ టీవీ

సీఎం విజయ్‌కి వున్న ఒకే ఒక్క టెన్షన్ అనగానే త్రిష... త్రిష అంటూ నినాదాలు, ఎక్కడ?

బాలీవుడ్‌లో నచ్చే పాత్రలు రావడం లేదు : హీరో సిద్ధార్థ్

సారీ సాయిపల్లవీ, నీకంటే నీ పక్కనే వున్నామే సీతగా బాగుంటుంది, ట్రోల్స్

చెన్నై లవ్ స్టోరీ విజయం ప్రేక్షకుల ప్రేమ, పరిశ్రమ ప్రశంసలే - రవి నంబూరి సత్తా

తర్వాతి కథనం
Show comments