రుద్రమదేవి మరణశాసనం దొరికిందోచ్.. క్రీస్తుశకం 1289 నవంబరు చివరి వారంలో మరణించారట!
కాకతీయ సామ్రాజ్య విస్తరణతో పాటు వైభవాన్ని దశదిశలా చాటిన కాకతీయ మహారాణి రుద్రమదేవికి సంబంధించిన ఆసక్తికర అంశం బయటికొచ్చింది. ఇప్పటివరకూ ఆమె మరణానికి సంబంధించి ఉన్న అభిప్రాయాలు తప్పన్న విషయాన్ని చెప్పే సాక్ష్యం బయటకు వచ్చింది. రుద్రమదేవికి సంబంధించిన మరణశాసనం ఒకటి తాజాగా గుర్తించారు. ఇప్పటివరకూ రాణి రుద్రమదేవి క్రీస్తు శకం 1296లో మరణించినట్లుగా చెప్పేవారు.
కానీ అంతకుముందే మృతి చెందినట్లు తాజాగా లభించిన మరణశాసనం ద్వారా రుజువైంది. మహబూబ్ నగర్ జిల్లా నల్లమలలో బయటపడిన తాజా శాసనం ప్రకారం రుద్రమదేవి క్రీస్తుశకం 1289 నవంబరు చివరి వారంలో ఆమె మరణించినట్లుగా తాజాగా బయటపడిన శాసనం స్పష్టం చేస్తోంది.
మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం మెడిమల్కల సమీపంలోని పురాత ఆలయంలో కాకతీయులకు సంబంధించిన శాసనాలు.. చిత్రాలు బయటకు వచ్చాయి. వీటి ప్రకారం రుద్రమదేవి మరణానికి సంబంధించిన కొత్త విషయాలు బయటికి వచ్చాయి.