ఇంటర్ విద్యార్థినిని హత్య చేసి గుట్టల్లో పడేశారు.. మరో విద్యార్థి కూడా...

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌, మదీనాగూడలో దారుణం జరిగింది. ఓ ఇంటర్‌ విద్యార్థినిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి గుట్టల్లో పడేశాడు. ఆ విద్యార్థినిని రేప్ చేసి ఆపై హత్య చేసి శవాన్ని గు

మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (09:58 IST)
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌, మదీనాగూడలో దారుణం జరిగింది. ఓ ఇంటర్‌ విద్యార్థినిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి గుట్టల్లో పడేశాడు. ఆ విద్యార్థినిని రేప్ చేసి ఆపై హత్య చేసి శవాన్ని గుట్టల్లో పడేసివుంటారని పోలీసులు భావిస్తున్నారు. 
 
విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు హత్యా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మృతురాలిని చాందిని జైన్‌గా గుర్తించారు. ఈ విద్యార్థిని బాచుపల్లిలో ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతూ, ఈనెల 9వ తేదీన ఇంటి నుంచి కాలేజీకి వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కేసు నమోదు చేశారు. మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకున్న  పోలీసులు దర్యాప్తు జరుపుతున్న తరుణంలో చాందిని జైన్ హత్యకు గురైన వార్త తెలిసింది. 
 
అలాగే, చంపాపేట్ శ్రీగాయత్రి విద్యా సంస్థల దాష్టీకం మరోసారి బయటపడింది. ద్వితీయ సంవత్సర విద్యార్థి సంజయ్‌ను లెక్చరర్లు చితకబాదారు. దీంతో మనస్తాపం చెందిన సంజయ్ తన నివాసమైన బాలాపూర్‌లోని జనప్రియ అపార్టుమెంట్స్ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన సంజయ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. 48 గంటలు గడిస్తేగానీ పరిస్థితి చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు.

అన్నీ చూడండి

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

Kenisha: జయం రవి, గాయని కెనీషా మధ్య రిలేషన్‌షిప్‌ కట్

Nag Aswin: సింగీతం గారి స్టయిల్ లో సింగ్ గీతం ఫన్ సినిమా :నాగ్ అశ్విన్

Regina Cassandra: ప్రేమ, ద్రోహం, ప్రతీకారంతో నిండిన కథగా మరీచిక ట్రైలర్

చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సహా 350కి పైగా టైటిల్స్‌ని డిజైన్ చేశా : పురుష: దర్శకుడు వీరు వులవల

తర్వాతి కథనం
Show comments