ముస్లిం వ్యాపారులు కరోనా పరీక్షలు చేయించుకోండి: అసదుద్దీన్‌

బుధవారం, 22 జులై 2020 (20:47 IST)
ముస్లిం వ్యాపారులందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని హైదరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం ఎంపి అసదుద్దీన్‌ ఒవైసి అన్నారు.

కరోనా పరీక్షలు చేయించుకోవడం ద్వారా తమను తాము కాపాడుకోవడమే కాకుండా సమాజాన్ని కాపాడినట్లు అవుతుందన్నారు.

యాకుత్‌పురా ఎమ్మెల్యే సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రీతో కలిసి ఆయన చార్మినార్‌ యునానీ ఆసుపత్రిలోని కరోనా పరీక్షల కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ఖురేషి సామాజిక వర్గానికి జరుగుతున్న కరోనా పరీక్షలను ఆయన పరిశీలించారు.

బక్రీద్‌ పండుగ సందర్భంగా జరిగే మాంసం విక్రయాల్లో ఖురేషి సామాజిక వర్గానికి చెందిన వ్యాపారుల ప్రాధాన్యత ఎంతో ఉంటుందన్నారు. వీరందరూ ముందస్తుగా కరోనా పరీక్షలు చేయించుకుంటే ఆశించిన ఫలితాలు ఉంటాయన్నారు.

అన్నీ చూడండి

Anna Lezhneva: పవన్ సొంత ఖర్చులే; డాక్టర్లకు కృతజ్ఞతలు:తెలిపిన అనా లెజినోవా

యూనియన్ బ్యాంకు చర్యలను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన బండ్ల గణేశ్

అంత:పురం తర్వాత వదలా చిత్రం బెస్ట్ ఫిల్మ్. గ్లింప్స్ : తమ్మారెడ్డి భరద్వాజ్

ఎట్టకేలకు ఈ నెల 23వ తేదీన 'జన నాయగన్' మూవీ రిలీజ్

Sandeep Reddy Vanga: సుమంత్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగా చిత్రం రోమాంచకం సిద్దం

తర్వాతి కథనం
Show comments