తెలంగాణాలో నేటి నుంచి ఆన్‌లైన్ బడులు

గురువారం, 1 జులై 2021 (09:30 IST)
తెలంగాణా రాష్ట్రంలో గురువారం నుంచి ఆన్‌లైన్ బడులు ప్రారంభంకానున్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు పాఠాలు చెబుతారు. రాష్ట్రంలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సుమారు 50 లక్షల మంది విద్యార్థులు ఉంటారని అంచనా. 
 
ఈ ఆన్‌లైన్‌ తరగతులను టీ-శాట్‌, దూరదర్శన్‌ల ద్వారా నిర్వహిస్తారు. అలాగే ఇంటర్‌ ద్వితీయ ఏడాదితో పాటు, ఇంజనీరింగ్‌ వంటి వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన తరగతులనూ గురువారం నుంచే ప్రారంభిస్తున్నారు.
 
మరోవైపు, ఆయా తరగతులకు చెందిన విద్యార్థులకూ ఆన్‌లైన్‌ ద్వారానే బోధన జరుగుతుంది. ఇంటర్‌ ద్వితీయ ఏడాది చదువుతోన్న విద్యార్థులు సుమారు 4.5 లక్షల మంది ఉన్నారు. కరోనా వైర్‌సను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆన్‌లైన్‌ ద్వారానే పాఠాలు చెప్పాల్సి ఉంటుంది. 
 
ఆన్‌లైన్‌ తరగతుల నేపథ్యంలో రాష్ట్రంలో ఉపాధ్యాయులు రోజు విడిచి రోజు విధులకు హజరయ్యేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రతి రోజు 50 శాతం మంది ఉపాధ్యాయులు బడులకు వెళ్లాల్సి ఉంటుంది. 
 
ఈ 50 శాతం ఉపాధ్యాయులు వారి బడి పరిధిలోని విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసులను వింటున్నారా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తారు. ఈ ఆన్‌లైన్‌ క్లాసుల్లో విద్యార్థులకు ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించడానికి వీలుగా ఉపాధ్యాయులు కృషి చేయాల్సి ఉంటుంది. 

అన్నీ చూడండి

జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది: మెగాస్టార్ చిరంజీవి

Pawan Kalyan surgery: పవన్ కళ్యాణ్ కి మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స

అఖిల్ హిట్టు కొట్టాడు అని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది

Ramya Krishna : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లక్ష్మి ప్రణతి పాత్రలో రమ్యకృష్ణ

ఏడుగురు మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథ తో హ్యాపీ జర్నీ

తర్వాతి కథనం
Show comments