Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైయస్ రాజశేఖరరెడ్డిపై వీహెచ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏంటంటే?

Written By సెల్వి
Updated: సోమవారం, 28 డిశెంబరు 2020 (14:17 IST)
దివంగత వైయస్ రాజశేఖరరెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీహెచ్ చేసిన వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. పీజేఆర్, తనకు మధ్య ఉన్న బంధాన్ని విడదీయాలని వైయస్ అప్పట్లో ప్రయత్నించారని వీహెచ్ అన్నారు. పీజేఆర్‌కు దూరమైతే ఎలాంటి సహాయం అయినా చేస్తానని వైయస్ తనకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారని చెప్పారు. అయితే, తాను ఆ ఆఫర్ ను తిరస్కరించానని అన్నారు. వైయస్ ఇచ్చిన ఆఫర్ ను తాను అంగీకరించి ఉంటే ఎంతో సంపాదించేవాడినని చెప్పారు.
 
తెలంగాణ కోసం పోరాడిన తొలి వ్యక్తి పీజేఆర్ అని వీహెచ్ కొనియాడారు. ఎంతో మంది పేదలకు ఇళ్లు ఇప్పించారని, తాగునీటి కోసం పోరాటం చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం పీజీఆర్‌ను ప్రజలు మరువరని చెప్పారు. 
 
మరోవైపు రేవంత్ రెడ్డి అభిమానుల పేరుతో వీహెచ్‌కు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ... తన అభిమానులను రేవంత్ రెడ్డి ఎందుకు నియంత్రించడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన అభిమానులపై రేవంత్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అన్నీ చూడండి

హీరో ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... కిమ్స్ ఆస్పత్రిలో ఏర్పాట్లు...

NTR Surgery: ఎన్టీఆర్ భుజానికి రేపు హైదరాబాద్‌లో శస్త్రచికిత్స !

మిస్సింగ్ మేఘన లో పిల్ల పిల్ల పిల్ల సాంగ్ చాలా బాగుంది : సురేష్ బాబు

Naresh: పదేళ్లుగా మిస్ అయిన నరేష్‌ను రంభ ఊర్వశి మేనక లో చూస్తారు : అల్లరి నరేష్

Maheshbabu: రాముడిగా మహేష్ బాబు ఫ్యాన్ ఎడిట్ వారణాసి ఉత్సాహపరుస్తోంది

తర్వాతి కథనం
Show comments