Festival Posters

అభిమానంతో ఆస్తులు అమ్మి గుడి కట్టారు.. ఇపుడు అమ్మకానికి పెట్టారు...

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (09:30 IST)
తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో ఆయనకు గుడి కట్టించారు. ఇందుకోసం తన ఆస్తులను సైతం అమ్ముకున్నారు. అలాంటి నేతలను సీఎం కేసీఆర్ పట్టించుకోలేదు. దీంతో తీవ్ర ఆవేదనకు లోనైన వారు... ఆ గుడిని, గుడిలోని విగ్రహానికి అమ్మకానికి పెట్టారు. ఈ ఘట తెలంగాణ రాష్ట్రంలోని దండేపల్లిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దండేపల్లి గ్రామానికి చెందిన గుండ రవీందర్‌ అనే వ్యక్తి సీఎం కేసీఆర్‌కు వీరాభిమాని. తెరాస నేత. ఈయన తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో ఆస్తులు అమ్మి, అప్పులు చేసి గుడి కట్టించారు. కానీ, కేసీఆర్ సీఎం అయ్యాక తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. 
 
ఈ క్రమంలో కొన్నిరోజుల క్రితం కేసీఆర్ విగ్రహం ముఖాన్ని సంచులతో కప్పివేశాడు. తీరా ఇప్పుడు విగ్రహాన్ని విక్రయిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. తెలంగాణ ఉద్యమంలో ఎంతో కష్టపడ్డానని, వేల రూపాయలు అప్పులు చేశానని, కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో గుడి కట్టినా నన్ను పట్టించుకోవడం లేదంటూ.. ఆయన ఇటీవల తెరాసకు రాజీనామా చేసి భాజపాలో చేరారు. ఉద్యమంలో చేసిన అప్పులు చెల్లించడం ఇబ్బందిగా మారిందని దీంతో విగ్రహాన్ని విక్రయించడానికి సిద్ధపడినట్లు ఆయన పేర్కొన్నారు.

అన్నీ చూడండి

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

తర్వాతి కథనం
Show comments