తెలంగాణాలో దారుణం - ఆఫీసులో వీఆర్వో దారుణ హత్య

సోమవారం, 14 మార్చి 2022 (12:52 IST)
తెలంగాణ రాష్ట్రంలో దారుణం జరిగింది. తాహశీల్దారు కార్యాలయంలోనే వీఆర్వో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. ఈ దారుణం మంచిర్యాల జిల్లా కన్నెపల్లి తాహశీల్దారు కార్యాలయంలో జరిగింది. ఇక్కడ కొత్తపల్లి వీఆర్వోగా పని చేస్తున్న దుర్గంబాబు (50) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు చంపేసి పారిపోయారు. 
 
తాహశీల్దారు కార్యాలయంలోనే దారుణ హత్యకు గురికావడం స్థానికంగా సంచలనం సృష్టిస్తుంది. రక్తపు మడుగులో విగతజీవిగా పడివున్న దుర్గంబాబును గుర్తించిన కార్యాలయ సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు హత్యా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు. 

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments