టీఎస్ఆర్టీసీ దొంగదెబ్బ : రిజర్వేషన్ చార్జీల పెంపు

శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (17:05 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు దొంగదెబ్బ కొట్టింది. ప్రయాణికులపై అదనపు భారం మోపింది. ఇప్పటికే రెండుసార్లు బస్సు చార్జీలు పెంచిన ఆర్టీసీ.. ఇపుడు మరో పిడుగు వేసింది. గుట్టుచప్పుడు కాకుండా రిజర్వేషన్ చార్జీలను పెంచేసింది. అయితే, ఈ పెంపు భారంపై ఆర్టీసి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 
 
ఒక్కో ప్రయాణ టిక్కెట్ రిజర్వేషన్ చార్జీపై రూ.20 నుంచి రూ.30 వరకు పెంచేసింది. ఈ పెంచిన చార్జీలు కూడా తక్షణం అమల్లోకి రానున్నాయి. దీంతో టిక్కెట్ చార్జీలు మరింతగా పెరగనున్నాయి. దీనిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ బాదుడు చాలదన్నట్టుగా మరోమారు ఆర్టీసీ చార్జీలు పెరుగుతాయని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించడంపై ప్రయాణికులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నదూరాలకు కూడా టిక్కెట్ చార్జీలను పెంచడంతో ప్రయాణికులు గగ్గోలుపెడుతున్నారు. 

అన్నీ చూడండి

chiatanya case: సమంతపై వస్తున్న కంటెంట్‌పై నాగ చైతన్య పోరాటం - సెప్టెంబర్ లో కోర్టు విచారణ

కోలీవుడ్ అగ్రహీరో అజిత్‌కు మాతృవియోగం

Peddi - తెలంగాణ లో పెద్ది టిక్కెట్ల పెంపు కు బ్రేక్ - ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ప్రదర్శనలు

Vamsiramaraj : భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు

Charan, Modi: ప్రధాని మోదీతో పెహ్లి' చాట్‌ను పంచుకున్న రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments