తుమ్మలపల్లి 'వంశీ' సత్యనారాయణ... కొత్త చిత్రం
తెలుగు సినిమా గర్వించదగ్గ గొప్ప దర్శకుల్లో 'వంశీ' ఒకరు. 'మంచుపల్లకి, సితార, లేడీస్ టైలర్, ఏప్రిల్1 విడుదల, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, గోపి.. గోపిక గోదావరి' వంటి హిలేరియస్ ఎంటర్టైనర్స్ను అందించిన గొప్ప దర్శకుడాయన. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన 'ట్రేడ్మార్క్' కలిగిన వంశీ.. తాజాగా ఓ చిత్రం తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు.
ఇండస్ట్రీ స్లంపులో ఉన్నా వరుసగా చిత్రాలు నిర్మిస్తూ అందరి దృష్టినీ అమితంగా ఆకర్షిస్తూ.. అనతికాలంలోనే అగ్రశ్రేణి నిర్మాణసంస్థగా ఎదిగిన 'భీమవరం టాకీస్' ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల ఎంపిక జరుపుకొంటున్న ఈ చిత్రం గురించి భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ... 'వంశీగారితో ఓ సినిమా నిర్మించాలన్నది నా చిరకాల కోరిక. అది నెరవేరుతున్నందుకు నాకు కలుగుతున్న ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఓ ప్రముఖ యువ కథానాయకుడు నటించనున్న ఈ చిత్రం అతి త్వరలో సెట్స్కు వెళ్లనుంది. వంశీగారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను' అన్నారు!!