మరో మల్టీ స్టారర్.. తమిళ రీమేక్ లో వెంకీ, రవితేజ..!
టాలీవుడ్లో మల్టీ స్టారర్ చిత్రాల హవా కొనసాగుతోంది. తాజాగా విక్టరీ వెంకటేష్, రవితేజల కాంబినేషన్లో మరో మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కనుంది. వీరి కాంబినేషన్లో చిత్రం చేయడానికి చాలా కాలంగానే ప్రయత్నీస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి కుదిరినట్టుంది. దీంతో ఈ చిత్రంపై హీరోలు దృష్టి సారిస్తున్నారు.
ఇందుకోసం తమిళంలో హిట్ సాధించిన 'జిల్లా' రీమేక్ హక్కులను పొందినట్టు సమాచారం. వీరు పోట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. త్వరలో అన్ని వివరాలను వెల్లడిస్తామని హీరోలు చెబుతున్నారు.