Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌కి షాక్ ఇచ్చిన అఖిల్

Written By శ్రీ
Updated: మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (23:06 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాథాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యు.వి. క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇందులో రెబల్‌స్టార్ కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సంవత్సరంలోనే ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ... కరోనా కారణంగా కుదరలేదు.
 
ప్రభాస్ - పూజాహేగ్డే జంటగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. హైదరాబద్‌లోనే భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే ఇప్పుడు ప్రభాస్‌కి అఖిల్ షాక్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ మేటర్ ఏంటంటే... అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.
 
ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అఖిల్ సరసన పూజా హేగ్డే నటిస్తుంది. ఈ సినిమా సమ్మర్లో రిలీజ్ కావాల్సి వుంది కానీ కుదరలేదు. ప్రభాస్ రాథేశ్యామ్, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ పూజా హేగ్డే.
 
అయితే ముందుగా ప్రభాస్ రాథేశ్యామ్ మూవీ షూటింగ్‌లో జాయిన్ అవుతుంది అనుకున్నారు కానీ... అఖిల్ తన సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి షాక్ ఇచ్చాడు. అఖిల్, పూజాపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ రాథేశ్యామ్ వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో రిలీజ్ కానుంది.

అన్నీ చూడండి

సెల్ ఫోన్ రిపేర్ కోసం ర్యాపిడో బైక్ పైన వెళ్తున్న యువతిని ఢీకొట్టిన బస్సు, మృతి

మంత్రి పదవి పోయినందుకు బాధలేదు.. కానీ అకారణంగా తొలగించడం బాధగా ఉంది : కొండా సురేఖ

ఎన్ని అవమానాలు ఎదురైనా కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు : కొండా మురళి

ఆర్మీ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ - మాజీ హవిల్దార్‌కు కస్టడీ

తిరుమలకు చేరుకున్న ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సులు

అన్నీ చూడండి

చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం

ఆరోగ్యం తేడా వచ్చి ఆస్పత్రులకు వెళితే గుంజేస్తాయి, అందుకే DatesMilk

నెఫ్రోప్లస్ NIDA, నెఫ్రోప్లస్ అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ ప్రారంభం

salt lemon water, గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే?

ఈ సమస్యలున్నవారు దానిమ్మ కాయలు తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments