Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్, పూజా హెగ్డే కాంబినేషన్ మరోసారి రాబోతుంది !

Written By డీవీ
Updated: శనివారం, 25 జనవరి 2025 (11:55 IST)
Allu Arjun, Pooja Hegde
అల్లు అర్జున్, పూజా హెగ్డే కాంబినేషన్ హిట్ పెయిర్. వారిద్దరూ మరోసారి జోడికట్టబోతున్నారు. ఇందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కసరత్తు చేస్తున్నారు. అలవైకుంఠపురంలో  చిత్రం ఎంతటి సక్సెస్ అయిందో తెలియందికాదు. ఈ సినిమాలో పాటలు కూడా ప్రజాదరణ పొందాయి. పదేళ్ళపాటు ఈ సినిమాను చెప్పుకుంటారని అల్లు అరవింద్ అప్పట్లోనే స్టేట్ మెంట్ ఇచ్చారు. తాజాగా పుష్ప 2 సినిమా అన్నింటినీ మరిపించేలాచేసింది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమాచేయబోతున్నాడో చర్చ అభిమానుల్లోనూ నడుస్తోంది.
 
విశ్వసనీయ సమాచారం ప్రకారం, అలవైంకుంఠపురంలో చిత్రానికి సీక్వెల్ కు సన్నాహాలు జరుగుతున్నాయ్. ఇందులోనూ అల్లు అర్జున్, పూజా హెగ్డే నటించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పై సినిమా రూపొందబోతోంది. ఇందుకు కథాచర్చలు కూడా మొదలయ్యాయి. ప్రీప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుని మార్చి 15న సినిమాను ట్రాక్ ఎక్కించనున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్; త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన నిమాలు హిట్ అయ్యాయి. ఈసారి పుష్ప 2 తర్వాత ఎలాంటి సినిమా చేయాలనే డైలమాలో అల్లు అర్జున్ వున్నట్లు తెలిసింది. 
 
ఆమధ్య సంథ్య థియేటర్ ఉదంతం తర్వాత జైలునుంచి ఇంటికి వచ్చాక మొదటగా అల్లు అర్జున్ ను కలిసింది త్రివిక్రమ్ శ్రీనివాస్. అప్పటికే వీరికాంబినేసన్ వున్నట్లు వార్తలు వచ్చాయి. అందుకే మార్చి 15న ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలిసింది. ఇందులో సంగీత దర్శకుడు ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. థమన్, దేవీశ్రీ ప్రసాద్ కు ఛాన్స్ వుంటుందా? లేదా బాలీవుడ్ నుంచి మ్యూజిషన్ ను తీసుకురానున్నారో చూడాలి. త్వరలో మరింత సమాచారం రానుంది.

అన్నీ చూడండి

భావన ఆరోపణలన్నీ అవాస్తవం, ఆమె విధుల్లో కొనసాగుతున్నారు: టెక్ మహీంద్రా

ప్రాణం తీసిన కుమారుడు ఐఫోన్ మోజు - విషాదానికి ముందు తల్లి సంగీత వీడియో

డీవైఎఫ్ఐ అధ్యక్షురాలిగా తొలిసారి మహిళ ఎంపిక

నీ కోసం నా మంగళ సూత్రాన్ని తీసేస్తాను బిడ్డా... నన్ను వదిలి వెళ్లకు (వీడియో)

లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్... బెంగుళూరు రెస్టారెంట్‌ బిల్లులో బాడీ షేమింగ్

అన్నీ చూడండి

విదేశాల్లోనూ సాధ్యం కాని చికిత్స.. హైదరాబాద్‌లో సుడాన్‌ రోగికి మళ్లీ నడక

న్యూమోనియా ఎదుటివారికి అంటుకుంటుందా?

నిమ్మకాయ టీ తాగుతున్నారా?

చెన్నై కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంకక్షణా కేంద్రం

దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ఏమిటో తెలుసా?: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచనలు

తర్వాతి కథనం
Show comments