రైస్ పుల్లింగ్‌తో రూ.26 కోట్ల మోసం.. జయచిత్ర కుమారుడు అరెస్టు!

గురువారం, 18 మార్చి 2021 (20:04 IST)
రైస్ పుల్లింగ్ పేరుతో రూ.26 కోట్ల మేరకు మోసం చేసిన కేసులో సీనియర్ నటి జయచిత్ర కుమారుడు, సినీ సంగీత దర్శకుడు అమ్రేష్‌ను చెన్నై నగర పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సీనియర్‌ నటి జయచిత్ర కుమారుడు అమ్రేష్‌.. నటుడిగా పలు చిత్రాలలో నటించారు. చెన్నైలోని వలసరవాక్కంకు చెందిన నెడుమారన్‌ అనే వ్యక్తిని రైస్‌ పుల్లింగ్‌ పేరుతో రూ.26 కోట్లకు మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో కోలీవుడ్‌ ఒక్కసారిగా షాక్‌కి గురైంది. ప్రస్తుతం అమ్రేష్‌ను ఇదే విషయమై చెన్నై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్ చేసి.. విచారణ జరుపుతున్నారు. 
 
అమ్రేష్‌ తన స్నేహితులతో కలిసి దాదాపు 8 సంవత్సరాల నుంచి నెడుమారన్‌ను రైస్‌ పుల్లింగ్‌ పేరుతో మాయ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడట. రైస్‌ పుల్లింగ్‌ కలశం అని చెప్పి, అది ఇంటిలో ఉంటే.. ప్రపంచాన్ని జయించవచ్చని తెలుపుతూ.. 8 సంవత్సరాలుగా మోసం చేస్తూ.. ఇప్పటివరకు రూ.26 కోట్లను నెడుమారన్‌ నుంచి వసూలు చేశారట. 
 
రైస్‌ పుల్లింగ్‌ కలశం ఇంటిలో పెట్టుకున్నా.. ఎటువంటి మార్పు లేకపోవడంతో.. వెంటనే నెడుమారన్‌ సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు అమ్రేష్‌ను, అతని సన్నిహితుల్ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. కోలీవుడ్‌ అంతా ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌. అయితే, ఈ వ్యవహారంపై జయచిత్ర ఇప్పటివరకు స్పందించలేదు. 

అన్నీ చూడండి

విద్యార్థినికి 60 మార్కులు వస్తే 5 మార్కులుగా చూపించిన లెక్చరర్, డిబార్ చేసిన అధికారులు

అమ్మా క్యాంటీన్లలో రుచికరమైన ఆహారం అందించండి.. సీఎం విజయ్ ఆదేశాలు

నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ - ఎన్టీఏ అధికారులకు సమన్లు

రోడ్లపై నమాజ్ చేస్తే ఊరుకోం : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

స్కార్పియో, పది లక్షలు, బంగారం, 16 ఉంగరాలు ఇచ్చినా సరిపోలేదు.. వివాహితను ఏం చేశారు?

అన్నీ చూడండి

లివర్ ఆరోగ్యం కోసం ఏం చేయాలి?

మామిడి పండ్లు తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

బ్యాడ్ కొలెస్ట్రాల్ వుందా, ఇలా వదిలించుకోవచ్చు

మీ చాయ్‌: ఆంధ్రప్రదేశ్‌లో టీ కల్తీపై అవగాహన కల్పిస్తోన్న టాటా టీ చక్ర గోల్డ్ జెమిని

వాతావరణ మార్పులు, ప్రజల నేత్ర ఆరోగ్యం: తలెత్తుతున్న ఆందోళనలు

తర్వాతి కథనం
Show comments