రైస్ పుల్లింగ్‌తో రూ.26 కోట్ల మోసం.. జయచిత్ర కుమారుడు అరెస్టు!

గురువారం, 18 మార్చి 2021 (20:04 IST)
రైస్ పుల్లింగ్ పేరుతో రూ.26 కోట్ల మేరకు మోసం చేసిన కేసులో సీనియర్ నటి జయచిత్ర కుమారుడు, సినీ సంగీత దర్శకుడు అమ్రేష్‌ను చెన్నై నగర పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సీనియర్‌ నటి జయచిత్ర కుమారుడు అమ్రేష్‌.. నటుడిగా పలు చిత్రాలలో నటించారు. చెన్నైలోని వలసరవాక్కంకు చెందిన నెడుమారన్‌ అనే వ్యక్తిని రైస్‌ పుల్లింగ్‌ పేరుతో రూ.26 కోట్లకు మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో కోలీవుడ్‌ ఒక్కసారిగా షాక్‌కి గురైంది. ప్రస్తుతం అమ్రేష్‌ను ఇదే విషయమై చెన్నై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్ చేసి.. విచారణ జరుపుతున్నారు. 
 
అమ్రేష్‌ తన స్నేహితులతో కలిసి దాదాపు 8 సంవత్సరాల నుంచి నెడుమారన్‌ను రైస్‌ పుల్లింగ్‌ పేరుతో మాయ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడట. రైస్‌ పుల్లింగ్‌ కలశం అని చెప్పి, అది ఇంటిలో ఉంటే.. ప్రపంచాన్ని జయించవచ్చని తెలుపుతూ.. 8 సంవత్సరాలుగా మోసం చేస్తూ.. ఇప్పటివరకు రూ.26 కోట్లను నెడుమారన్‌ నుంచి వసూలు చేశారట. 
 
రైస్‌ పుల్లింగ్‌ కలశం ఇంటిలో పెట్టుకున్నా.. ఎటువంటి మార్పు లేకపోవడంతో.. వెంటనే నెడుమారన్‌ సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు అమ్రేష్‌ను, అతని సన్నిహితుల్ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. కోలీవుడ్‌ అంతా ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌. అయితే, ఈ వ్యవహారంపై జయచిత్ర ఇప్పటివరకు స్పందించలేదు. 

అన్నీ చూడండి

భార్యకు మోకాళ్ల నొప్పులు.. ఆటోమేటిక్ మెట్లు తయారు చేసిన భర్త (video)

ముంబైకి రెడ్ అలర్ట్- వారాంతంలో భారీ నుండి అతి భారీ వర్షాలు (video)

శనివారం నుండి పాపికొండలకు పర్యాటక పడవ సేవలు పునఃప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లో జూలై 4, 2026 నాటి వాతావరణం ఎలా వుంది...?

ప్రేయసికి నిశ్చితార్థం.. వివాహిత ప్రియుడి బెదిరింపులు.. పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఉలవలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా?

క్యాల్షియం మాత్రలు అన్నం తిన్నాక ఎంత గ్యాప్ తీసుకుని వేసుకోవాలి?

వైద్యుని సలహా లేకుండా వేసుకునే మందులతో కాలేయం ఏమవుతుందో తెలుసా?

రక్తం వృద్ధి చేసే అద్భుత ఆహారాలు

పద్మభూషణ్ డా. నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments