Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంచ‌న 3 త‌ర్వాత లారెన్స్ భారీ ప్లాన్... మెగాస్టార్ చిరుతో...

Written By శ్రీ
Updated: శుక్రవారం, 29 మార్చి 2019 (13:52 IST)
రాఘ‌వ లారెన్స్ తెర‌కెక్కించిన తాజా చిత్రం కాంచ‌న 3. ముని సినిమాకి 4వ పార్ట్ గా వ‌స్తున్న కాంచ‌న 3 సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ సినిమాలో లారెన్స్ స‌ర‌స‌న‌ వేదిక, ఓవియా నటించారు. హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను ఏప్రిల్ 19వ తేదీన విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా కాంచ‌న 3 ట్రైలర్‌ను లాంచ్ చేశారు. అనంత‌రం లారెన్స్ మాట్లాడుతూ.... మునికి తీసిన అన్ని పార్ట్‌లు సూపర్ హిట్ అవడం థ్రిల్లింగ్‌గా ఉంది. 
 
ఇప్పుడు 4వ పార్ట్‌గా వస్తున్న కాంచన 3 కూడా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. దేవుని అనుగ్రహంతో, ప్రేక్షకుల ఆదరణతో 10 పార్ట్‌ల వరకు తీయలనేది నా బలమైన కోరిక. నేను హీరోగా, డైరెక్టర్‌గా సినిమాలు చేస్తూనే, నన్ను పెద్ద డాన్స్ మాస్టర్ని చేసిన మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సినిమా చేయాల‌నుకుంటున్నాను. అలాగే నన్ను మాస్ సినిమాతో డైరెక్టర్‌ని చేసిన కింగ్ నాగార్జున గారితో ఒక సినిమా  చేయాలనేది నా కోరిక అన్నారు. లారెన్స్ ఆలోచ‌న బాగానే ఉంది. మ‌రి.. ఈ ప్రాజెక్టులు ఎప్పుడు సెట్స్ పైకి వెళ‌తాయో చూడాలి.

అన్నీ చూడండి

కిడ్నాప్ ఆరోపణల కేసు.. వైకాపా నేత షేక్ మహ్మద్ ముస్తఫా అరెస్ట్

దేశవ్యాప్తంగా వడదెబ్బకు 20మంది మృతి.. తెలంగాణలో అత్యధిక కేసులు

వెనిజువెలాలో భారీ భూకంపం... మృతుల సంఖ్య 6,125 పైమాటే...

సజ్జల నన్నే రావద్దంటారా? వైసిపి పార్టీ ఆఫీసు ముందు బోరుమంటూ బోరుగడ్డ అనిల్, వీడియో

హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ

అన్నీ చూడండి

మూత్రపిండాల సమస్య వున్నవారు కొబ్బరి నీరు తాగితే ఏమవుతుంది?

ఇక డాక్టర్ల పని అయిపోయినట్లేనా, రానున్న 3 ఏళ్లలో ఆస్టిమస్ రోబోలే బెస్ట్ డాక్టర్స్ అంట, నిజమా?!!

మీ ఉదయానికి శక్తినివ్వండి: మీ అల్పాహారంలో కాలిఫోర్నియా బాదం ఎందుకు ఉండాలంటే?

ఎస్ఆర్ఎం ప్రైమ్ జోన్ ఫ్రీ కార్డు ఆవిష్కరణ - చెన్నై నగర వాసులకు ఆరోగ్య సంరక్షణ సేవలు

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆల్‌బకరా పండ్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments