ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (09:30 IST)

"అత్తమ్మ కిచెన్"తో ఫుడ్ బిజినెస్‌లోకి చిరంజీవి భార్య సురేఖ

Chiranjeevi, Surekha, Anjanadevi
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్‌గా పేరుగాంచిన చిరంజీవికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా  దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించింది. ఈ నేపథ్యంలో చిరంజీవి సతీమణి సురేఖ ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. 
 
సురేఖ చలనచిత్ర నిర్మాణంలోకి ప్రవేశిస్తుందని చాలామంది ఎదురుచూస్తుండగా, ఆమె ఫుడ్ ఇండస్ట్రీలోకి అడుగెపట్టారు. సురేఖ అత్తమ్మ కిచెన్‌ని పరిచయం చేశారు. ముఖ్యంగా ప్రయాణికులకు తక్షణ భోజనాన్ని అందించడంపై దృష్టి సారించారు.
 
అత్తమ్మ కిచెన్ పేరిట సురేఖ ప్రారంభించిన ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన బిజినెస్‌పై చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించారు. సురేఖ పుట్టిన రోజును పురస్కరించుకుని ఓ చిత్రాన్ని పంచుకున్నారు. ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాశారు: మీరు ఎక్కడికి వెళ్లినా ఇంటి రుచిని కనుగొనండి. అత్తమ్మ కిచెన్, హడావిడి లేకుండా ఇంటి రుచిని మీ ఇంటి వద్దకు తీసుకురావడానికి ఇక్కడ ఉంది. దక్షిణ భారతీయ వంటకాల రుచికరమైన వంటలను ఇది అందిస్తుంది. మీ ప్రయాణం, మా ఇంటి రుచి... అంటూ తెలిపారు. 
 
ఇకపోతే.. చిరంజీవి తన తదుపరి సోషియో ఫాంటసీ డ్రామా షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమా విశ్వంభర పేరిట తెరకెక్కుతోంది.